జియో 4జీ తరహాలో ఎయిర్‌టెల్ కూడా చౌక ధరకు స్మార్ట్ ఫోన్లు

Webdunia
శనివారం, 12 సెప్టెంబరు 2020 (16:09 IST)
రిలయన్స్ జియో 4జీ స్మార్ట్‌ఫోన్‌ ద్వారా టెలికాం రంగంలో ఓ విప్లవాన్ని సృష్టించింది. తాజాగా ఎయిర్‌టెల్ సంస్థ కూడా తమ వినియోగదారుల కోసం తక్కువ ధరలకు 4జీ ఆండ్రాయిట్ స్మార్ట్‌ఫోన్లను త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. 
 
తద్వారా తమ వినియోగదారుల సంఖ్యను, సేవలను మరింత విస్తరించేందుకు అవకాశాలు లభిస్తాయని ఎయిర్‌టెల్ భావిస్తోంది. తక్కువ ధరకు 4జీ స్మార్ట్‌ఫోన్లను తీసుకురావడంపై పలు స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలతో ఎయిర్‌టెల్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. 
 
ఎయిర్‌టెల్ బ్రాండ్‌తోనే ఈ స్మార్ట్‌ఫోన్లను తయారు చేసి ఇచ్చేలా సదరు తయారీ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇతర బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లలో ఎయిర్‌టెల్ 4జీ సేవలను మాత్రమే వినియోగించేలా చౌక ధరకు స్మార్ట్‌ఫోన్లను తయారు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
 
దేశంలో డేటా ఛార్జీలు సామాన్యులకు సైతం అందుబాటులో ఉన్నా... స్మార్ట్‌ఫోన్ల ఖరీదు ఎక్కువగా ఉండటంతో సామాన్య ప్రజలు వీటికి దూరంగా ఉంటున్నారు. వీరిని దృష్టిలో ఉంచుకునే తక్కువ ధరలతో స్మార్ట్‌ఫోన్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 
 
తక్కువ ధరలకు స్మార్ట్‌ఫోన్లు అందించి సామాన్యులకు కూడా దగ్గరకావడం ద్వారా తమ వినియోగదారుల పరిధిని మరింత పెంచుకునేందుకు సొంత స్మార్ట్‌ఫోన్లు ఉపయోగపడుతుందని ఆ సంస్థ భావిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments