Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెటిజన్లకు శుభవార్త... కనీస ఇంటర్నెట్ వేగాన్ని నాలుగు రెట్లు పెంపుదల

ఇంటర్నెట్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కనీస ఇంటర్నెట్ వేగాన్ని నాలుగు రెట్లకు పెంచింది. అంటే ప్రస్తుతం కనీస ఇంటర్నెట్ వేగం సెకనుకు 512 కిలోబైట్లుగా ఉంది. దీన్ని 2 మెగాబైట్లకు పెంచనున్

Webdunia
మంగళవారం, 24 అక్టోబరు 2017 (14:29 IST)
ఇంటర్నెట్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కనీస ఇంటర్నెట్ వేగాన్ని నాలుగు రెట్లకు పెంచింది. అంటే ప్రస్తుతం కనీస ఇంటర్నెట్ వేగం సెకనుకు 512 కిలోబైట్లుగా ఉంది. దీన్ని 2 మెగాబైట్లకు పెంచనున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను త్వరలోనే జారీ చేయనుంది. ఈ విషయాన్ని కేంద్ర టెలికాం కార్యదర్శి అరుణా సుందరరాజన్ వెల్లడించారు. 
 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిపోతోంది. దీన్ని మరింత ప్రోత్సహించేలా కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అంటే ఇకపై కనీస ఇంటర్నెట్ వేగం సెకనుకు 2 మెగాబైట్లుగా ఉండనుందని టెలికం శాఖ కార్యదర్శి అరుణా సుందరరాజన్ వెల్లడించారు. ఇంటర్నెట్ వేగం చాలా తక్కువగా ఉంటోందని గ్రామీణ ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని, త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడతాయని ఆయన అన్నారు.
 
3జీ, 4జీ తరాలు పోయి 5జీ తరం రానుందని, ఈ నేపథ్యంలో కనీస వేగం మరింతగా పెరగాల్సిన అవసరం ఉన్నప్పటికీ, మౌలిక వసతుల కొరత దృష్ట్యా 2 ఎంబీపీఎస్ వరకూ మాత్రమే వేగం పెంచలగమని భావిస్తున్నట్టు తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థ డిజిటల్ ఎకానమీగా మారుతోందని, దీనికి వేగవంతమైన ఇంటర్నెట్ తప్పనిసరిని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments