భారత మార్కెట్లోకి జియోనీ మాక్స్ స్మార్ట్ఫోన్ విడుదలైంది. చైనా ఉత్పత్తులపై నిషేధం విధించాలనే డిమాండ్ పెరిగిపోతున్న తరుణంలో.. జియోని ఏడాది తర్వాత తన ఉత్పత్తులను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. జియోనీ మాక్స్ స్మార్ట్ఫోన్తో కొత్త ఫోనును ఆవిష్కరించింది. బ్లాక్, రెడ్, రాయల్ బ్లూ మూడు రంగుల్లో లభించనుంది.
జియోనీ మాక్స్ 2 జీబీ ర్యామ్ +32 జిబి స్టోరేజ్తో వస్తుంది. దీని ధర రూ. 5,999 మాక్స్ ఆగస్టు 31 నుండి ఫ్లిప్కార్ట్ ద్వారా లభ్యమవుతుంది. ప్రధానంగా బిగ్ బ్యాటరీ, ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఫీచర్లతో ఎంట్రీ లెవల్ ధర వద్ద జియోనీ మాక్స్ లాంచ్ అయింది.