Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబర్ వరకు వర్క్ ఫ్రమ్ హోమ్- ఫేస్‌బుక్?

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (14:54 IST)
కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది చివరి వరకు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రాణాంతక కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా జనజీవనమంతా స్తంభించిన తరుణంలో ఆర్థిక కార్యాకలాపాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కాలు బయటపెడితే కరోనా ఏ పక్క నుంచి కాటేస్తుందోనని ప్రతి ఒక్కరూ బయపడుతున్నారు. 
 
ఓ వైపు కరోనా మరోవైపు లాక్‌డౌన్‌ కారణంగా సామాన్య ప్రజలతో పాటు ఉద్యోగులు కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలోనే చాలా కంపెనీలు తమ రోజూవారి కార్యాకలపాలను కొనసాగించేందుకు ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం అవకాశాన్ని కల్పించాయి. కేవలం భారత్‌లోనే కాక ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు ఇదే విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ కీలక నిర్ణయం తీసుకుంది.
 
కరోనా నేపథ్యంలో ఇప్పటికే వర్క్ ఫ్రం హోం అవకాశం ఇచ్చిన ఫేస్‌బుక్ సంస్థ.. దానిని ఈ ఏడాది (2020) చివరి వరకు పొడిగించడానికి ఉద్యోగులతో సంప్రదింపులు జరుపుతోంది. ఇక ప్రముఖ సెర్చ్‌ ఇంజన్‌ గూగుల్‌ కూడా ఇదే బాటలో పయనించాలని చూస్తున్నట్లు సమాచారం. అయితే ఉద్యోగుల అందరికీ వర్క్‌ ఫ్రం హోమ్‌ ఇస్తారా లేక 50 శాతం ఉద్యోగులకు మాత్రమే ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. 
 
ఇక దేశంలో హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైతో పాటు ముంబై, ఢిల్లీలోనూ కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. ఈ పిరిస్థితుల్లో ఉద్యోగులకు వెసులుబాటు కల్పిస్తే ప్రమాదాలు వాటిల్లే అవకాశం ఉందని ప్రభుత్వ అధికారులతో పాటు ఆయా సంస్థల యాజమాన్యాలు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరుణంలో వర్క్‌ ఫ్రం హోం ఉత్తమం అని వైద్య అధికారులతో పాటు ప్రముఖుల సైతం భావిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments