టిక్ టాక్‌తో అమెరికాకు విఘాతం తప్పదు.. ఫేస్‌బుక్ సీఈవో

Webdunia
మంగళవారం, 25 ఆగస్టు 2020 (16:10 IST)
Zukerburg
టిక్ టాక్ వల్ల అమెరికా సాంకేతిక ఆధిపత్యానికి విఘాతం కలుగవచ్చునని ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా భద్రతకు టిక్ టాక్ ప్రమాదకరం కాగలదన్న ట్రంప్ సర్కార్ ఆరోపణలను ఆయన సమర్థించారు. చైనా యాప్‌లపై పలు దేశాలు వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి. డ్రాగన్ కంట్రీకి సంబంధించిన పలు యాప్‌లను భారత్ ఒక్కసారిగా నిషేధించడం ప్రపంచ వ్యాప్తంగా ఒక సెన్సేషన్‌ను క్రియేట్ చేసింది.
 
భారత్ నిర్ణయంతో ఆ దేశానికి చెందిన ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ కుదేలైపోయింది. అమెరికా సైతం ఈ యాప్‌ను నిషేధించాలని నిర్ణయించింది. యూఎస్ కంపెనీ కింద ఈ సంస్థ ఉంటే సమస్య లేదని ట్రంప్ సర్కార్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, అమెరికాలో దీన్ని సొంతం చేసుకునేందుకు మైక్రోసాఫ్ట్ ప్రయత్నాలు ప్రారంభించింది.
 
ఇలాంటి సమయంలో జుకర్ బర్గ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాకు చెందిన సోషల్ మీడియా సంస్థలు చాలా ప్రమాదకరమని... వాటి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. మరోవైపు, టిక్ టాక్‌ను నిషేధిస్తామన్న ట్రంప్ సర్కార్ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేస్తామని టిక్ టాక్ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

Naresh Agastya: శ్రీవిష్ణు క్లాప్ తో నరేష్ అగస్త్య కొత్త చిత్రం ప్రారంభం

Mowgli 2025: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్... వనవాసం సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments