Webdunia - Bharat's app for daily news and videos

Install App

5జీ సేవలను ప్రారంభించనున్న ఎయిర్‌టెల్..

రిలయన్స్ జియో 4జీ సేవలను ప్రారంభించి దేశంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తొలుత రిలయన్స్ ఉద్యోగులకు ఈ సేవలను అందించిన జియో.. ఆపై ప్రజలకు ఉచిత డేటా పేరిట ప్రజలకు కూడా అందజేసింది. 4జీతో పాటు ఉచిత డ

Webdunia
శనివారం, 18 నవంబరు 2017 (12:32 IST)
రిలయన్స్ జియో 4జీ సేవలను ప్రారంభించి దేశంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తొలుత రిలయన్స్ ఉద్యోగులకు ఈ సేవలను అందించిన జియో.. ఆపై ప్రజలకు ఉచిత డేటా పేరిట ప్రజలకు కూడా అందజేసింది.

4జీతో పాటు ఉచిత డేటా అందించడం ద్వారా టెలికాం రంగంలో సంచలనం సృష్టించింది. దీంతో టెలికాం రంగ సంస్థలన్నీ నష్టాలను చవిచూశాయి. ఆపై తేరుకున్న ఇతరత్రా టెలికాం సంస్థలు జియోకు పోటీగా ఆఫర్లు ప్రకటించాయి. 
 
తాజాగా భారత టెలికాం ధిగ్గజం ఎయిర్ టెల్ 5 జీ  సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకోసం టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్‌లో జతకట్టింది. భారత్‌లో 5జీ సేవలను అందించేందుకు గాను ఎయిర్‌టెల్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎరిక్సన్ సంస్థ తెలిపింది. భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా 36 ఆపరేటర్లతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మిర్టిల్లో తెలిపారు. 
 
ఎరిక్సన్‌ ఇప్పటికే ఎయిర్‌టెల్‌కు 4జి తోపాటు ఇతర సేవలందించేందుకు అవసరమైన టెక్నాలజీని అందిస్తూనే ఉంది. ఈ క్రమంలో త్వరలోనే 2జీ, 3జీ సేవలను పూర్తిగా పక్కనబెట్టేందుకు ఎయిర్ టెల్ రంగం సిద్ధం చేసుకుంటోంది. అలాగే 4జీ, 5జీలపైనే పూర్తిగా దృష్టి పెట్టేందుకు ఎయిర్ టెల్ రెడీ అవుతోంది.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments