ఫేస్‌బుక్‌కి ఝలక్ ఇచ్చిన ఎన్నికల సంఘం..

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (12:58 IST)
కేంద్ర ఎన్నికల కమిషన్ సోషియా మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కి సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీకి చెందిన విశ్వాస్‌నగర్ బీజేపీ ఎమ్మెల్యే ఓంప్రకాష్ శర్మ మార్చి 1వ తేదీన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ ఫోటోతో పాటు ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాల ఫోటోలతో ఉన్న రెండు పోస్టర్లను ఫేస్‌బుక్‌లో పోస్టు చేసారు. 
 
కాగా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన కారణంగా ఎన్నికల నియమావళి అమలులోకి రావడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ అభినందన్ వర్థమాన్ ఫోటోలను బీజేపీ ఎమ్మెల్యే శర్మ ఫేస్‌బుక్ ఖాతా నుంచి తొలగించాలని ఆదేశించింది. అంతేకాకుండా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు లోక్‌సభ ఎన్నికల ప్రచార పర్వంలో భారత సైన్యం గురించి ప్రస్తావించవద్దని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది.
 
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో శబరిమల పేరుతో ఓట్లు అడగరాదంటూ ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలు, నాయకులను ఇప్పటికే హెచ్చరించింది. దీనితో పాటు శబరిమల వివాదం, దానిపై సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది. మతం పేరుతో ఎన్నికల ప్రచారం చేయడం కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామాఖ్య ఎక్స్ ట్రార్డినరీ ఫిల్మ్. పవర్ ఫుల్ థ్రిల్లర్ అంటున్న చిత్ర యూనిట్

Niharika Konidela: రాకాస నుంచి స్నేక్ డ్యాన్స్ వీడియో సాంగ్ రిలీజ్

Teja Sajja : ఓటీటీ రియాలిటీ షో ది ట్రైటర్స్ హోస్ట్ గా తేజ సజ్జా

G.V. Prakash Kumar: మన అందరి జీవితాల్లో నాన్నబిగ్గెస్ట్ హీరో : జివి ప్రకాష్ కుమార్

రవీంద్ర తేజ్, అరియా మోడీ ప్రేమికులుగా లవ్‌ వాలా మూవీ ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కంటెంట్, వాణిజ్యాల సమ్మిళిత ప్రపంచంలో జీవిస్తున్నజెన్ ఆల్ఫా వెల్లడించిన ఏఎస్‌సీఐ అధ్యయనం

ఖాళీ కడుపుతో లవంగాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

చెడు కొలెస్ట్రాల్ కరిగిపోవాలంటే తేనెతో ఈ పదార్థాలు తింటే చాలు

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలి, ప్రయోజనాలు ఏమిటి?

పిల్లలు కనమంటే నో చెప్తున్న రష్యా మహిళలు.. వ్లాదిమిర్ పుతిన్‌కు తలనొప్పి

తర్వాతి కథనం
Show comments