Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్‌కి ఝలక్ ఇచ్చిన ఎన్నికల సంఘం..

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (12:58 IST)
కేంద్ర ఎన్నికల కమిషన్ సోషియా మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కి సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీకి చెందిన విశ్వాస్‌నగర్ బీజేపీ ఎమ్మెల్యే ఓంప్రకాష్ శర్మ మార్చి 1వ తేదీన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ ఫోటోతో పాటు ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాల ఫోటోలతో ఉన్న రెండు పోస్టర్లను ఫేస్‌బుక్‌లో పోస్టు చేసారు. 
 
కాగా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన కారణంగా ఎన్నికల నియమావళి అమలులోకి రావడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ అభినందన్ వర్థమాన్ ఫోటోలను బీజేపీ ఎమ్మెల్యే శర్మ ఫేస్‌బుక్ ఖాతా నుంచి తొలగించాలని ఆదేశించింది. అంతేకాకుండా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు లోక్‌సభ ఎన్నికల ప్రచార పర్వంలో భారత సైన్యం గురించి ప్రస్తావించవద్దని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది.
 
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో శబరిమల పేరుతో ఓట్లు అడగరాదంటూ ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలు, నాయకులను ఇప్పటికే హెచ్చరించింది. దీనితో పాటు శబరిమల వివాదం, దానిపై సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది. మతం పేరుతో ఎన్నికల ప్రచారం చేయడం కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments