ప్రముఖ కంప్యూటర్ల తయారీ సంస్థ డెల్ మరో రెండు ఆండ్రాయిడ్ టాబ్లెట్స్ను మార్కెట్లోకి విడుదల చేసింది. డెల్ వెన్యు 7, డెల్ వెన్యు 8 పేరుతో తాజా మోడళ్లు భారత మార్కెట్లో అందుబాటులోకి తెచ్చింది. ఈ నూతన టాబ్లెట్స్లో 3జీతో పాటు వాయిస్ కాలింగ్ సౌకర్యం కూడా ఉంది. దీంట్లో, 4,550 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, లేటెస్ట్ డ్యూయల్-కోర్ ఇంటెల్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.4 కిట్ కాట్ ఓఎస్ ఉన్నాయి.