బైజూస్ యజమాని రవీంద్రన్‌పై కేసు.. ఎందుకంటే..?

Webdunia
గురువారం, 5 ఆగస్టు 2021 (16:47 IST)
Byjus
బైజూస్ యజమాని రవీంద్రన్‌పై కేసు నమోదు అయింది. యూపీఎస్సీ సిలబస్‌‌కు సంబంధించి తప్పుడు సమాచారాన్ని అందించారన్న ఆరోపణలతో ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. క్రిమోఫోబియా అనే సంస్థ చేసిన ఫిర్యాదు ఆధారంగా నేరపూరిత కుట్ర, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 69 (ఎ) కింద రవీంద్రన్ పై కేసు నమోదు చేశామని ముంబై పోలీసులు తెలిపారు. 
 
క్రిమియోఫోబియా వ్యవస్థాపకుడు స్నేహిల్ ధాల్.. యూపీఎస్‌సీకి సంబంధించి బైజూస్ తప్పుడు సమాచారాన్ని అందించిందని ఆరోపించారు. యుపీఎస్‌సీ ప్రిపరేటరీ మెటీరియల్‌లో సీబీఐని యుఎన్‌టీఓసీకి నోడల్ ఏజెన్సీగా చెప్పినట్లుగా వెల్లడించారు. 
 
ఈ విషయాన్నిగమనించిన వెంటనే కంపెనీకి అవసరమైన మార్పులు చేయమని కోరుతూ ఒక ఈ-మెయిల్ పంపినా.. బైజూస్‌ సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించినట్లు వెల్లడించారు. 
 
ఈ విష‌య‌మై బైజూస్‌ రవీంద్రన్ స్పందిస్తూ.. ఎఫ్‌ఐఆర్‌ కాపీని తమ న్యాయవాదులు పరిశీలిస్తున్నారని తెలిపారు. భారత్ లో బాగా పాపులర్‌ ఎడ్యుకేషనల్‌ యాప్‌గా పేరొందిన బైజూస్‌.. తన సేవలను మరింతగా విస్తరించనుంది. ఇకపై అకడామిక్‌ ఓరియెంటెండ్‌ సర్వీసెస్‌ లను మాత్రమే కాకుండా.. రాబోయే రోజుల్లో ప్రొఫెషనల్‌, సర్టిఫికేట్‌ కోర్సులపై కూడా దృష్టి సారించనుంది. ప్రస్తుతం టీమిండియాకు స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments