Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో దెబ్బ.. బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్.. రూ.249కే అపరిమిత ఇంటర్నెట్‌

రిలయన్స్ జియో సేవలు సోమవారం నుంచి దేశ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ టెలికామ్ సంస్థలు ధరల విషయంలో కిందికి దిగిరాక తప్పడం లేదు. ముఖ్యంగా, ప్రైవేట్ సంస్థల పరిస

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (05:27 IST)
రిలయన్స్ జియో సేవలు సోమవారం నుంచి దేశ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ టెలికామ్ సంస్థలు ధరల విషయంలో కిందికి దిగిరాక తప్పడం లేదు. ముఖ్యంగా, ప్రైవేట్ సంస్థల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. ప్రభుత్వ రంగ టెలికామ్ సంస్థ పరిస్థితి మాత్రం మరోలా ఉంది. అందుకే ఉన్న వినియోగదారులు చేజారిపోకుండా, కొత్త వినియోగదారులను ఆకర్షించేలా సరికొత్త బ్రాండ్ బాండ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. 
 
ఇందులోభాగంగా రూ.249 (బీబీ249 ప్లాన్)తో రీఛార్జ్‌ చేసుకుంటే అపరిమితంగా ఇంటర్నెట్‌ను వినియోగించుకోవచ్చని వెల్లడించింది. తాజా పథకంలో రూ.249తో రీఛార్జ్‌ చేసుకుంటే 1జీబీ వరకు 2ఎంబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌ను వినియోగించుకోవచ్చు. ఆ తర్వాత 1ఎంబీపీఎస్‌ వేగంతో నెల మొత్తం అపరిమితంగా అంతర్జాలాన్ని వాడుకోవచ్చని, ఇది కేవలం కొత్త వినియోగదారులు మాత్రమే ఈ పథకానికి అర్హులని, ఈనెల తొమ్మిది తేదీ నుంచి ఈ స్కీమ్ అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. అలాగే, ఈ స్కీమ్ ప్రమోషనల్ సమయంలో ఇన్‌స్టాలేషన్ చార్జీలను పూర్తిగా మినహాయించనున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments