ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ప్రీ-పెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను సవరించింది. రూ.97, ఆ పైబడిన ప్లాన్లకు కొత్త లాభాలు వర్తిస్తాయి. మొత్తం 25 ప్లాన్లు, ప్రీపెయిడ్ వోచర్లు, ఫస్ట్ రీచార్జ్ కూపన్లకు వర్తించనుంది. ఎంటీఎన్ఎల్ నెట్ వర్క్ ఉపయోగించే బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు కూడా రూ.99, రూ.104, రూ.349, రూ.447 ప్లాన్లపై ఈ ఆఫర్ వర్తించనుంది. ఈ ప్లాన్లపై రోజుకు 250 నిమిషాలు లభించనున్నాయి.
ఈ ఆఫర్ భారతదేశమంతటా అందుబాటులోకి రానుంది. మొదటగా చెన్నై, తమిళనాడు సర్కిల్లో దీన్ని సవరించనున్నారు. వాయిస్ కాలింగ్ నిమిషాలు, ఎస్ఎంఎస్ మెసేజ్లు, డేటా లాభాల్లో ఎలాంటి మార్పులు వుండవని బీఎస్ఎన్ఎల్ ఓ ప్రకటనలో వెల్లడించింది.