Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్ టెల్ ప్రీ-పెయిడ్ కస్టమర్లకు ఆఫర్స్.. ఉచితంగా కూపన్లు

Webdunia
శనివారం, 29 ఆగస్టు 2020 (17:46 IST)
ఎయిర్ టెల్ ప్రీ-పెయిడ్ కస్టమర్లకు భారతీ ఎయిర్‌టెల్ సంస్థ మరో ఆఫర్‌ను అందిస్తోంది. పలు ప్రీపెయిడ్ ప్లాన్లను వాడుతున్న వారికి ఉచితంగా డేటా కూపన్లను అందజేస్తోంది. రూ.219, రూ.289, రూ.448, రూ.599 ప్లాన్లను వాడుతున్న వారికి ఈ కూపన్లు లభిస్తాయి. అయితే ఇందుకు గాను ఆయా ప్లాన్లను ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా రీచార్జి చేసుకోవాలి. దీంతో ఉచిత కూపన్లు వస్తాయి.
 
ఎయిర్‌టెల్ ఆయా ప్లాన్లకు అందించే కూపన్లకు వాలిడిటీ కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. కూపన్‌ను రిడీమ్ చేశాక ఒక్క రోజులోగా దానికి అందించే ఉచిత డేటాను వాడుకోవాలి. కాగా రూ.289 ప్లాన్‌లో కస్టమర్లకు నిత్యం 1.5 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు, ఉచిత కాల్స్ వస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది. దీనికి 1జీబీ డేటా చొప్పున 2 ఉచిత కూపన్లు వస్తాయి. 
 
కూపన్ల వాలిడిటీ 28 రోజులు ఉంటుంది. కానీ రిడీమ్ చేస్తే మాత్రం ఒక్క రోజులోనే వాటిని వాడుకోవాలి. డేటాను వాడినా, వాడకున్నా కూపన్‌ను రిడీమ్ చేశాక దానికి ఒక్క రోజే వాలిడిటీ ఉంటుంది.
 
అలాగే రూ.448 ప్లాన్‌లో రోజుకు 3జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు, ఉచిత కాల్స్ వస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది. దీనికి కూడా 1జీబీ డేటా చొప్పున 2 ఉచిత కూపన్లు వస్తాయి. రూ.599 ప్లాన్‌కు 4 కూపన్లు ఇస్తారు. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ఇందులో రోజుకు 3జీబీ డేటా వస్తుంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments