Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌వలో 5జీ సేవలు.. ట్రయల్ రన్ సక్సెస్

టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా, వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రైవేట్ టెలికాం కంపెనీలు పోటాపోటీగా సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్నాయి.

Webdunia
శనివారం, 24 ఫిబ్రవరి 2018 (08:55 IST)
టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా, వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రైవేట్ టెలికాం కంపెనీలు పోటాపోటీగా సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్నాయి. ఇప్పటికే 4జీ టెక్నాలజీతో దేశీయ టెలికాం రంగం సేవల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఇకపై 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైంది. దీంతో త్వరలోనే 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 
 
దేశంలో ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్, చైనా టెలికాం ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరర్ సంస్థ హువేయి కలిసి 5 జీ నెట్‌వర్క్ ట్రయల్‌ను భారత్‌లో నిర్వహించగా, ఇది విజయవంతమైంది. 5జీ ట్రయల్ విజయవంతమైందని, సెకనుకు 3జీబీ డేటా వేగాన్ని అందుకున్నట్టు ఆ రెండు సంస్థలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పేర్కొంది. 
 
గురుగ్రామ్‌లోని మనేసర్‌లో ఉన్న ఎయిర్‌‌టెల్ నెట్‌వర్క్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ట్రయల్ నిర్వహించినట్టు ఎయిర్‌టెల్ పేర్కొంది. టెస్ట్ విజయవంతం కావడంతో త్వరలోనే భారత్‌లో 5జీ ఈకో సిస్టం అభివృద్ధికి చర్యలు ప్రారంభిస్తామని భారతీ ఎయిర్‌టెల్ డైరెక్టర్ (నెట్‌వర్క్స్) అభయ్ సావర్గోవంకర్ తెలిపారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments