జియో ఎఫెక్ట్: ఎయిర్టెల్ మరో ఎత్తుగడ.. టెలినార్ను కైవసం చేసుకునే దిశగా అడుగులు
రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు ఎయిర్టెల్ మరో ఎత్తుగడ వేసింది. దేశ టెలికాం రంగంలో తన మార్కెట్ వాటాను విస్తరించుకునేందుకు వీలుగా గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇప్పటికే తమ వినియోగదా
రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు ఎయిర్టెల్ మరో ఎత్తుగడ వేసింది. దేశ టెలికాం రంగంలో తన మార్కెట్ వాటాను విస్తరించుకునేందుకు వీలుగా గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇప్పటికే తమ వినియోగదారులను నిలబెట్టుకునేందుకు అనేక ఆఫర్లు ప్రకటించింది.
ఇపుడు నార్వే ఆధారిత టెలికం సంస్థ టెలినార్కు చెందిన భారత వాటాను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సుమారు 350 మిలియన్ డాలర్ల టెలినార్ వాటాను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం టెలినార్తో చర్చలు కూడా జరుపుతోంది. సంస్థలోని సగం వాటాను ప్రస్తుతం కొనుగోలు అనంతరం మిగిలిన సగభాగాన్ని కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. జనవరి చివరికి నాటికి ఇరు సంస్థల మధ్య ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని నివేదికలు తెలుపున్నాయి.
కాగా, టెలినార్కు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5.3 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. అయినా తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. స్పెక్ట్రం వేలం చెల్లింపులకు సంబంధించి భారత ప్రభుత్వానికి టెలినార్ రూ.1900 కోట్లు, రుణాల రూపంలో బ్యాంకులకు మరో రూ.1800 కోట్లు బకాయి పడింది. దీంతో ఈ రుణ భారంలో సగం చెల్లించడం ద్వారా దానిని సొంతం చేసుకోవాలని ఎయిర్టెల్ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది.