Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియోకు ఎయిర్‌టెల్ చావుదెబ్బ... రూ.399తో న్యూ ప్లాన్

దేశీయ టెలికాం రంగంలో పెను సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన రిలయన్స్ జియోను దెబ్బతీసేందుకు అన్ని టెలికాం కంపెనీలు వ్యూహప్రతివ్యూహాల్లో నిమగ్నమైపోతున్నాయి. ముఖ్యంగా, జియోను కట్టడి చేసేందుకు ఎత్తుకుపైఎత్త

Webdunia
ఆదివారం, 6 ఆగస్టు 2017 (09:32 IST)
దేశీయ టెలికాం రంగంలో పెను సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన రిలయన్స్ జియోను దెబ్బతీసేందుకు అన్ని టెలికాం కంపెనీలు వ్యూహప్రతివ్యూహాల్లో నిమగ్నమైపోతున్నాయి. ముఖ్యంగా, జియోను కట్టడి చేసేందుకు ఎత్తుకుపైఎత్తులు వేస్తున్నారు. 
 
ఇందులోభాగంగా, ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ సరికొత్త ప్లాన్‌తో ముందుకొచ్చింది. అచ్చం జియోను పోలిన ప్రీపెయిడ్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.399 రీచార్జ్‌తో రోజుకు 1జీబీ 4జీ డేటాను 84 రోజులపాటు అందించనున్నట్టు తెలిపింది. 
 
ఈ ప్లాన్‌లో భాగంగా ఏ నెట్‌వర్క్ అయినా అపరిమితంగా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ 4జీ సిమ్‌తో 4జీ హ్యాండ్‌సెట్ యూజర్లకు మాత్రమేనని వివరించింది.
 
అలాగే, రూ.399 రీచార్జ్‌తోపాటు రూ.244 ప్లాన్‌ను కూడా భారతీ ఎయిర్‌టెల్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కింద రోజుకు 1జీబీ డేటాను 70 రోజులు పాటు ఉపయోగించుకోవచ్చు. అయితే వాయిస్ కాల్స్ మాత్రం ఎయిర్‌టెల్ పరిధిలోనే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దెబ్బకు రిలయన్స్ జియో దూకుడుకు బ్రేకులు పడతాయని టెలికాం రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments