పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోవాల్సిందే.. మార్చి 2021 వరకు గడువు

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (17:33 IST)
పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసుకోలేదంటే.. ఇబ్బందులు తప్పవు. ఆధార్‌తో పాన్ కార్డు లింక్ చేసుకోకపోతే పాన్ కార్డు చెల్లుబాటు కాదు. పాన్ కార్డును ఉపయోగించడం కుదరదు. ఇప్పటిదాకా 32.71 కోట్ల పాన్ కార్డులు ఆధార్ కార్డులతో అనుసంధానమయ్యాయని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది.
 
మోదీ సర్కార్ పాన్ ఆధార్ లింక్ గడువును పొడిగిస్తూ వస్తున్న నేపథ్యంలో.. తాజాగా పాన్ ఆధార్ అనుసంధానానికి గడువు మార్చి 2021 వరకు ఉంది. జూన్ 29 నాటికి దేశంలో జారీ అయిన పాన్ కార్డుల సంఖ్య 50.95 కోట్లుగా ఉంది. 
 
నిర్దేశిత గడువులోగా పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసుకోకపోతే పాన్ కార్డులు పని చేయవని, చెల్లుబాటు కావని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఇంకా ఇప్పటికీ 18 కోట్ల పాన్ కార్డులు ఆధార్ కార్డులతో లింక్ కావాల్సి ఉంది. 
 
ఇంకా పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసుకోని వారికి ఇంకా 7 నెలల గడువు ఉంది. ఎక్కువ గడువు ఉందని అలాగే ఉండిపోవద్దు. వెంటనే రెండింటినీ లింక్ చేసుకోండి. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌కు వెళ్లి ఆధార్, పాన్ లింక్ చేసుకోవచ్చు. క్షణాల్లో పని పూర్తి చేసుకోవచ్చునని ఐటీ నిపుణులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha Prabhu : అనాథలతో లైట్ ఆఫ్ జాయ్ 2025 దీపావళి జరుపుకున్న సమంత

Atlee: శ్రీలీల, బాబీ డియోల్ కాంబినేషన్ లో అట్లీ - రాణ్వీర్ సింగ్ చిత్రం

Samyuktha: ది బ్లాక్ గోల్డ్ లో రక్తపు మరకలతో రైల్వే ఫ్లాట్ పై సంయుక్త ఫస్ట్ లుక్

తప్పుకున్న డైరెక్టర్.. బాధ్యతలు స్వీకరించిన విశాల్

Naveen Polishetty: అనగనగా ఒక రాజు తో సంక్రాంతి పోటీలో నవీన్ పోలిశెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments