Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో బీఎస్ఎన్ఎల్ ఐదు రోజుల మెగా మేళా...

ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ ఐదు రోజుల పాటు మెగా మేళా ప్రకటించింది. ఉచితంగా సిమ్‌తో పాటు డేటాను అందిస్తూ, సోమవారం నుంచి ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక మేళాను నిర్వహించనుందని తెల

Webdunia
ఆదివారం, 22 అక్టోబరు 2017 (10:14 IST)
ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ ఐదు రోజుల పాటు మెగా మేళా ప్రకటించింది. ఉచితంగా సిమ్‌తో పాటు డేటాను అందిస్తూ, సోమవారం నుంచి ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక మేళాను నిర్వహించనుందని తెలంగాణ టెలికాం సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ అనంతరామ్‌ వెల్లడించారు. ఈ మేళాలో భాగంగా, 3జీ స్మార్ట్ సిమ్‌ను, 350 మెగాబైట్ల డేటాను ఫ్రీగా అందిస్తామని తెలిపారు. 
 
రెండు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో 27వ తేదీ వరకూ మెగా మేళా జరుగుతుందని అనంతరామ్ రామ్ చెప్పారు. ఇదే సమయంలో ల్యాండ్ లైన్, బ్రాడ్ బ్యాండ్, ఎఫ్టీటీహెచ్ కనెక్షన్లను కూడా కస్టమర్లు పొందవచ్చని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 18001801503 నంబరుకు కాల్ చేయాలని తెలిపారు.
 
ఇప్పటికే.. రిలయన్స్ జియో 4జీ ఫోన్లు పూర్తిగా జనాల చేతుల్లోకి రాకముందే బీఎస్ఎన్ఎల్ 4జీ ఫీచర్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసి జియోకు భారీ షాకిచ్చింది. దేశీయ మొబైల్ మేకర్ మైక్రోమ్యాక్స్‌తో కలిసి "భారత్ 1" పేరుతో 4జీ ఫీచర్‌ఫోన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 20 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ ధర రూ.2200. ''భారత్ 1''లో నగదు లావాదేవీల కోసం ''భీమ్'' యాప్‌ను పొందుపరిచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments