"పరుగుల కింగ్" విరాట్ కోహ్లీ ఖాతాలో అరుదైన రికార్డు

Webdunia
బుధవారం, 2 నవంబరు 2022 (17:31 IST)
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఫీట్‌ను సాధించారు. ఐసీసీ ట్వంటీ20 ప్రపచం కప్ పోటీల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు పుటలకెక్కాడు. బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‍లో కోహ్లీ వ్యక్తిగతంగా 16 పరుగులు చేయడంతో ఈ అరుదైన ఫీట్‌ను తన సొంతం చేసుకున్నాడు. 
 
ఇప్పటివరకు ఆ స్థానంలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేళ జయవర్థనే ఉన్నాడు. ఈయన మొత్తం 1016 పరుగులు చేశాడు. ఇపుడు ఆయన్ను వెనక్కినెట్టి విరాట్ కోహ్లీ ఆక్రమించాడు. ప్రస్తుతం కోహ్లీ 1065 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. 
 
జయవర్థనే మొత్తం 31 ఇన్నింగ్స్‌లలో 1016 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 25 ఇన్నింగ్స్‌లలో 1065 పరుగులు చేయడం గమనార్హం. ఈ మెగాటోర్నీలోనే మరికొన్ని మ్యాచ్‌లలో కోహ్లీ ఆడాల్సి ఉండటంతో మంచి ఫామ్‌లో ఉన్న కోహ్లీ మరిన్ని పరుగులు చేసే అవకాశం లేకపోలేదు.
 
కాగా, ప్రస్తుతం ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌తో ఆడిన ప్రారంభ మ్యాచ్‌లో కోహ్లీ 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడమే కాకుండా, మ్యాచ్‌ను గెలిపించాడు. ఆ తర్వాత నెదర్లాండ్స్‌పై 62 పరుగులు, సౌతాఫ్రికాపై 12, బంగ్లాదేశ్‌పై 64 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలాగే, ఈ టోర్నీలో కోహ్లీ ఇప్పటివరకు ఏకంగా 273 పరుగులు చేసి టోర్నీలో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Wedding: భాంగ్రా నృత్యం చేస్తూ వధువు మృతి.. పెళ్లికి కొన్ని గంటలకు ముందే...?

కాలేజీ స్టూడెంట్‌పై యాసిడ్ దాడి.. చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలు..

First State Butterfly: రాష్ట్ర నీలి సీతాకోకచిలుకగా తిరుమల లిమ్నియాస్..

తాడుతో భర్త మెడను బిగించి ఊపిరాడకుండా చేసింది.. ఆపై కర్రతో తలపై కొట్టి చంపేసింది..

తిరుమలలో భారీ వర్షాలు.. పూర్తిగా నిండిపోయిన పాపవినాశనం, గోగర్భం జలాశయాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ లేదని చెబుతున్న లక్ష్మణ్ టేకుముడి, రాధికా జోషి

Director Vasishta, : జంతువుల ఆత్మతోనూ కథ తో నెపోలియన్ రిటర్న్స్

Vishnu: విష్ణు విశాల్... ఆర్యన్ నుంచి లవ్లీ మెలోడీ పరిచయమే సాంగ్

Gopichand: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి సినిమా భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

తర్వాతి కథనం
Show comments