Webdunia - Bharat's app for daily news and videos

Install App

"పరుగుల కింగ్" విరాట్ కోహ్లీ ఖాతాలో అరుదైన రికార్డు

Webdunia
బుధవారం, 2 నవంబరు 2022 (17:31 IST)
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఫీట్‌ను సాధించారు. ఐసీసీ ట్వంటీ20 ప్రపచం కప్ పోటీల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు పుటలకెక్కాడు. బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‍లో కోహ్లీ వ్యక్తిగతంగా 16 పరుగులు చేయడంతో ఈ అరుదైన ఫీట్‌ను తన సొంతం చేసుకున్నాడు. 
 
ఇప్పటివరకు ఆ స్థానంలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేళ జయవర్థనే ఉన్నాడు. ఈయన మొత్తం 1016 పరుగులు చేశాడు. ఇపుడు ఆయన్ను వెనక్కినెట్టి విరాట్ కోహ్లీ ఆక్రమించాడు. ప్రస్తుతం కోహ్లీ 1065 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. 
 
జయవర్థనే మొత్తం 31 ఇన్నింగ్స్‌లలో 1016 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 25 ఇన్నింగ్స్‌లలో 1065 పరుగులు చేయడం గమనార్హం. ఈ మెగాటోర్నీలోనే మరికొన్ని మ్యాచ్‌లలో కోహ్లీ ఆడాల్సి ఉండటంతో మంచి ఫామ్‌లో ఉన్న కోహ్లీ మరిన్ని పరుగులు చేసే అవకాశం లేకపోలేదు.
 
కాగా, ప్రస్తుతం ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌తో ఆడిన ప్రారంభ మ్యాచ్‌లో కోహ్లీ 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడమే కాకుండా, మ్యాచ్‌ను గెలిపించాడు. ఆ తర్వాత నెదర్లాండ్స్‌పై 62 పరుగులు, సౌతాఫ్రికాపై 12, బంగ్లాదేశ్‌పై 64 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలాగే, ఈ టోర్నీలో కోహ్లీ ఇప్పటివరకు ఏకంగా 273 పరుగులు చేసి టోర్నీలో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తర్వాతి కథనం
Show comments