కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ అదరగొట్టింది. ఫిరోజ్ షా కోట్లా మైదానంలో శుక్రవారం జరిగిన మ్యాచ్లో .. లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా (4/11) మ్యాజిక్తోపాటు ఓపెనర్ క్వింటన్ డి కాక్ (42 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్తో 59 నాటౌట్) అర్ధ సెంచరీతో రాణించడంతో.. ఆతిథ్య ఢిల్లీ 8 వికెట్ల తేడాతో పంజాబ్పై ఢిల్లీ గెలుపును నమోదు చేసుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 111 పరుగులు సాధించింది. మనన్ వోహ్రా (32) మినహా మిగతా బ్యాట్స్మెన్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ఓపెనర్ విజయ్ (1), కెప్టెన డేవిడ్ మిల్లర్ (9) సింగిల్ డిజిట్స్కే పరిమితం కాగా.. గ్లెన్ మాక్స్వెల్ (0) డకౌటయ్యాడు. అమిత్ మిశ్రా 4 వికెట్లు పడగొట్టగా.. జహీర్, క్రిస్ మోరిస్, జయంత్ యాదవ్ తలో వికెట్ తీశారు.
అనంతరం డేర్డెవిల్స్ కేవలం 2 వికెట్లు కోల్పోయి మరో 39 బంతులు మిగిలుండగానే (13.3 ఓవర్లు) లక్ష్యాన్ని ఛేదించింది. సంజూ శాంసన్ (33) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మిశ్రా ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.