ఐపీఎల్ 2019.. వేలంలో యువీకి షాక్.. తొలి రౌండ్లోనే హనుమ విహారికి చోటు

Webdunia
మంగళవారం, 18 డిశెంబరు 2018 (18:08 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2019 కోసం ఆటగాళ్ల ఎంపిక వేలం ద్వారా జరుగుతోంది. వేసవి కానుకగా ప్రారంభమయ్యే ఐపీఎల్ పోటీల్లో భాగంగా ఆయా ఫ్రాంచైజీలు వేలం పాటలో క్రికెటర్లను కొనేందుకు సిద్ధమయ్యాయి. జైపూర్ వేదికగా ఐపీఎల్-2019 సీజన్ వేలం పాట జరుగుతోంది. ఈ టోర్నీలోని ఎనిమిది ఫ్రాంచైజీలు కలిసి మొత్తం 70 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నారు. 
 
ఇందుకోసం 351 మంది క్రికెటర్లు పోటీపడుతున్నారు. ఈ వేలంలో భాగంగా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కి మొదటి రౌండ్ లో ఫ్రాంఛైజీలు షాకిచ్చాయి. మొదటి రౌండ్ లో యూవీని కొనుగోలు చేసేందుకు ఒక్క ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపించలేదు. యూవీతోపాటు మనోజ్ తివారి, పుజారా, మార్టిన్ గప్తిల్, బ్రెండన్ మెక్‌కలమ్, అలెక్స్ హేల్స్(ఇంగ్లాండ్)లపై ఫ్రాంఛైజీలు ఆసక్తి కనబర్చలేదు. 
 
ఇకపోతే.. ఈ వేలం పాటలో ఆంధ్రా క్రికెటర్ హనుమ విహారిని తొలి రౌండ్లోనే ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2కోట్లకు హనుమ విహారిని దక్కించుకుంది. రూ.50లక్షలతో వేలంలో పాల్గొన్న ఆల్‌రౌండర్ కోసం ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడగా ఆఖరికి రూ.2కోట్లకు విహారిని ఢిల్లీ దక్కించుకుంది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మొంథా తుఫాను.. రవాణాకు తీవ్ర అంతరాయాలు.. ముగ్గురు కొట్టుకుపోయారు... ఒకరినే?

మొంథా తుఫాను- తెలంగాణలో భారీ వర్షాలు- పెరుగుతున్న రిజర్వాయర్ మట్టాలు- హై అలర్ట్‌

Chandrababu London Tour: నవంబరులో చంద్రబాబు లండన్ టూర్.. ఎందుకో తెలుసా?

AP: ఆస్తి కోసం తండ్రిని, మరో మహిళను హత్య చేసిన వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మొంథా తుఫాను.. గర్భిణీ స్త్రీకి పురిటి నొప్పులు.. పోలీసులు అలా కాపాడారు.. కవలలు పుట్టారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments