ఐపీఎల్ 2022: రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయం...

Webdunia
శనివారం, 23 ఏప్రియల్ 2022 (11:31 IST)
ఐపీఎల్ 2022లో శుక్రవారం రాత్రి వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని అందుకుంది.
 
చివరి ఓవర్లో 'నో బాల్' లొల్లితో మ్యాచ్ కాసేపు ఆగగా.. రాజస్థాన్ విజయాన్ని మాత్రం ఢిల్లీ అడ్డుకోలేకపోయింది. 223 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 207 పరుగులు మాత్రమే చేసి.. 15 పరుగుల తేడాతో ఓడిపోయింది. 
 
రిషబ్ పంత్ (44), రోవ్‌మెన్ పావెల్ (36), లలిత్ యాదవ్ (37) ధాటిగా ఆడారు. రాజస్థాన్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3, అశ్విన్ 2 వికెట్లు పడగొట్టారు.
 
ఆఖరి రెండు ఓవర్లలో ఢిల్లీ విజయానికి 36 పరుగులు కావాల్సిన తరుణంలో 19వ ఓవర్‌ను ప్రసిధ్ కృష్ణ మెయిడిన్‌ వేసి ఒక వికెట్ తీశాడు. చివరి ఓవర్‌లో మొదటి మూడు బంతులకు 3 సిక్స్‌లు కొట్టిన రోవ్‌మన్‌ పావెల్ (36) ఢిల్లీని గెలిపించినంత పని చేశాడు. 
 
అయితే మూడో బంతిని మెక్‌కాయ్ ఫుల్‌టాస్ వేశాడు. అది నోబాల్ అని ఢిల్లీ వాదించింది. కెప్టెన్ పంత్, కోచింగ్ సిబ్బంది గందరగోళానికి తెరతీశారు. ఆటగాళ్లను ఆడకుండా వచ్చేయాలని పంత్ సైగలు చేశాడు. అయితే అంపైర్లు అది నోబాల్ కాదని స్పష్టం చేశారు. 
 
మెక్‌కాయ్‌ మిగతా మూడు బంతుల్లో కేవలం రెండు పరుగులే ఇచ్చి పావెల్‌ను ఔట్ చేయడంతో రాజస్థాన్‌ విజయం సాధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన.. రాజకీయ అరంగేట్రం చేస్తారా?

ఢిల్లీలో పోలీసులపై పెప్పర్ స్ప్రే దాడి.. ఎందుకో తెలుసా? (Video)

ఖలీదా జియాకు గుండె - ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ - తీవ్ర అస్వస్థత

జె-1 వీసా నిరాకరించిన అమెరికా.. మనస్తాపంతో మహిళా వైద్యురాలు ఆత్మహత్య

Kerala: భార్య తలపై సిలిండర్‌తో దాడి చేసిన భర్త.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వంద కోట్ల మార్కులో వరుసగా మూడు చిత్రాలు.. హీరో ప్రదీప్ రంగనాథన్ అదుర్స్

ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్ పుకార్లు.. కారణం ఏంటంటే?

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

తర్వాతి కథనం
Show comments