Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ ఫెస్టివల్

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (17:13 IST)
IPL 2021
క్రికెట్ అభిమానులకు ఇది నిజంగానే గుడ్ న్యూస్. ఐపీఎల్ 2021 మ్యాచ్‌లకు అభిమానులను అనుమతిస్తున్నట్టుగా అధికారిక ప్రకటన వెలువడింది. కరోనా కారణంగా ఐపీఎల్ 2021కు మధ్యలో బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లు సెప్టెంబర్ 19 నుంచి మొదలుకానున్నాయి.
 
ఈ టోర్నిలో మిగిలిన మ్యాచ్‌లు దుబాయ్, షార్జా, అబుదాబి వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 15న జరగనుంది. అయితే కోవిడ్ నిబంధనలు, యూఏఈ ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా పరిమిత సిట్టింగ్‌తో అభిమానులను స్టేడియాల్లోకి అనుమతించనున్నారు.
 
కోవిడ్ పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో.. ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సెప్టెంబర్ 19న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌ కింగ్స్ మ్యాచ్ అభిమానుల సందడి మధ్య జరగనుంది. 
 
ఈ మ్యాచ్‌తో పాటు టోర్నిలో మిగిలిన మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లు సెప్టెంబర్ 16 నుంచి ఆన్‌లైన్ అందుబాటులో ఉండనున్నాయి. ఇక, ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2021 తొలి దశ మ్యాచ్‌లలో ఆడిన 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

తిరుమల శ్రీవారి ఆలయం, చిత్రాలతో మొబైల్ గేమ్.. తాటతీస్తామన్న బీఆర్ నాయుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

తర్వాతి కథనం
Show comments