Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేక పుట్టించి రేసులో నిలిచిన కోల్‌కతా - ముంబై చిత్తు

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (08:19 IST)
ఐపీఎల్ 14 సీజన్ రెండో దశ పోటీలు దుబాయ్ వేదికగా జరుగుతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా, గురువారం డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌కు మరోమారు చుక్కెదురైంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ చేతిలో ఓడిపోయింది. దీనికి కారణం కెప్టెన్ రోహిత్ శర్మ లేకపోవడమేననే కామెంట్స్ వినిపించాయి. అయితే, గురువారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు ఓడిపోవడానికి కెప్టెన్ రోహిత్ శర్మే కారణం కావడం గమనార్హం. ఫలితంగా ముంబై జట్టు దారుణ పరాభవాన్ని ఎదుర్కొంది. ఐపీఎల్ రేస్‌లో నిలబడాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో కేకేఆర్ జట్టు సభ్యులు సమిష్టిగా రాణించి వీరవిహారం చేశారు. ఫలితంగా కేకేఆర్ తన ప్రత్యర్థి ముంబై జట్టును చిత్తు చేసింది. 
 
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై తొలి బంతి నుంచే దూకుడుగా ఆడింది. కెప్టెన్ రోహిత్ శర్మ, డికాక్ బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరును పరుగులు పెట్టించారు. రోహిత్ 30 బంతుల్లో 4 ఫోర్లతో 33, డికాక్ 42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 55 పరుగులు చేశారు. వీరి దూకుడుకు స్కోరు 200 పరుగులు దాటుతుందని భావించారు. 
 
అయితే, వీరిద్దరూ అవుటయ్యాక స్కోరు వేగం ఒక్కసారిగా మందగించింది. బ్యాటర్లు వరుసపెట్టి పెవిలియన్‌కు క్యూకట్టారు. సూర్యకుమార్ యాదవ్ (5), ఇషాన్ కిషన్ (14), కృనాల్ పాండ్యా (12) దారుణంగా నిరాశ పరిచారు. పొలార్డ్ మాత్రం 15 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 21 పరుగులు చేసి జట్టు ఆ మాత్రం స్కోరైనా చేయడంలో సాయపడ్డాడు. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లలో ప్రసీద్ కృష్ణ, ఫెర్గ్యూసన్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, సునీల్ నరైన్ ఓ వికెట్ తీసుకున్నాడు.
 
అనంతరం ముంబై నిర్దేశించిన 156 పరుగుల విజయ లక్ష్యాన్ని 15.1 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. శుభ్‌మన్ గిల్ 13 పరుగులకే వెనుదిరిగినా, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వెంకటేశ్ 30 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 పరుగులు చేయగా, రాహుల్ త్రిపాఠీ 42 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 74 పరుగులతో అజేయంగా నిలిచాడు. 
 
కెప్టెన్ మోర్గాన్ 7, నితీశ్ రానా 5 (నాటౌట్) పరుగులు చేశారు. రాహుల్ త్రిపాఠీ విధ్వంసానికితోడు వెంకటేశ్ అయ్యర్ చెలరేగడంతో కోల్‌కతా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సత్తా చాటింది. కోల్‌కతా కోల్పోయిన మూడు వికెట్లూ బుమ్రాకే దక్కాయి. సునీల్ నరైన్‌కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో కోల్‌కతా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకగా, ముంబై ఆరో స్థానానికి పడిపోయింది. శుక్రవారం షార్జాలో బెంగళూరు-చెన్నై మధ్య ఐపీఎల్ 35వ మ్యాచ్ జరగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వంశీకి ఆయుష్‌లో ముగిసిన చికిత్స - ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

Jagan: క్రిమినల్స్‌ను జగన్ ఓదార్చుతారా? ఎలాంటి సందేశం పంపుతున్నారు?: అనిత

కదులుతున్న రైల్లో నా రీల్ చూడండి, చేయి పోవచ్చు, కాలు పోవచ్చు, చనిపోవచ్చు (video)

Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన బాబు, పవన్

కేసీఆర్ కుమార్తె కవిత ఓ లేడీ డాన్.. చేయని దందా లేదు : మధుయాష్కీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

తర్వాతి కథనం
Show comments