Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎస్కే జట్టు కోచ్‌కు కరోనా.. ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలింపు...

Webdunia
గురువారం, 6 మే 2021 (17:37 IST)
బయో బబుల్‌లో ఉంటూ వచ్చిన ఐపీఎల్ క్రికెటర్లకు కూడా కరోనా వైరస్ సోకింది. దీంతో 14వ సీజన్ పోటీలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ సోకిన వారిలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కోచ్ మైఖేల్ హస్సీ, బౌలింక్ కోచ్ లక్ష్మీపతి బాలాజీలు వున్నారు. అయితే, ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితి మంరింత ఆందోళనకరంగా ఉండటంతో వీరిని ఎయిరి అంబులెన్స్‌ ద్వారా ఢిల్లీ నుంచి చెన్నైకు తరలించారు. 
 
దీనిపై చెన్నై ఫ్రాంచైజీ అధికారి ఒకరు స్పందిస్తూ, తమకు చెన్నైలో విస్తృతస్థాయిలో పరిచయాలు ఉన్నాయని, తద్వారా వారిద్దరికీ మరింత మెరుగైన వైద్య సదుపాయాలు అందించగలమని భావిస్తున్నామని వివరించారు. ప్రస్తుతానికి హస్సీ,  బాలాజీకి ఎలాంటి కొవిడ్ లక్షణాలు లేవని, వారిద్దరూ బాగానే ఆరోగ్యంగా ఉన్నట్టు తెలిపారు. 
 
ముందు జాగ్రత్త చర్యగా వీరిని సురక్షితంగా చెన్నైకు తరలించినట్టు చెప్పారు. ఆస్ట్రేలియా జాతీయుడైన మైఖేల్ హస్సీ కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ కోసం ఎదురుచూస్తున్నాడని, నెగెటివ్ సర్టిఫికెట్ వస్తే భారత్‌ను వీడేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. తమ జట్టులోని విదేశీ ఆటగాళ్లు భారత్‌ను వదిలి వెళ్లేందుకు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sonu Sood: తిరుమలలో చిరు వ్యాపారిని పలకరించిన సోనూ సూద్ (video)

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

తర్వాతి కథనం
Show comments