Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎస్కే జట్టు కోచ్‌కు కరోనా.. ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలింపు...

Webdunia
గురువారం, 6 మే 2021 (17:37 IST)
బయో బబుల్‌లో ఉంటూ వచ్చిన ఐపీఎల్ క్రికెటర్లకు కూడా కరోనా వైరస్ సోకింది. దీంతో 14వ సీజన్ పోటీలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ సోకిన వారిలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కోచ్ మైఖేల్ హస్సీ, బౌలింక్ కోచ్ లక్ష్మీపతి బాలాజీలు వున్నారు. అయితే, ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితి మంరింత ఆందోళనకరంగా ఉండటంతో వీరిని ఎయిరి అంబులెన్స్‌ ద్వారా ఢిల్లీ నుంచి చెన్నైకు తరలించారు. 
 
దీనిపై చెన్నై ఫ్రాంచైజీ అధికారి ఒకరు స్పందిస్తూ, తమకు చెన్నైలో విస్తృతస్థాయిలో పరిచయాలు ఉన్నాయని, తద్వారా వారిద్దరికీ మరింత మెరుగైన వైద్య సదుపాయాలు అందించగలమని భావిస్తున్నామని వివరించారు. ప్రస్తుతానికి హస్సీ,  బాలాజీకి ఎలాంటి కొవిడ్ లక్షణాలు లేవని, వారిద్దరూ బాగానే ఆరోగ్యంగా ఉన్నట్టు తెలిపారు. 
 
ముందు జాగ్రత్త చర్యగా వీరిని సురక్షితంగా చెన్నైకు తరలించినట్టు చెప్పారు. ఆస్ట్రేలియా జాతీయుడైన మైఖేల్ హస్సీ కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ కోసం ఎదురుచూస్తున్నాడని, నెగెటివ్ సర్టిఫికెట్ వస్తే భారత్‌ను వీడేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. తమ జట్టులోని విదేశీ ఆటగాళ్లు భారత్‌ను వదిలి వెళ్లేందుకు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

తర్వాతి కథనం
Show comments