Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్-13వ సీజన్.. రైనా సంగతేంటో కానీ.. సీఎస్కే ధోనీపై భారం..

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2020 (11:25 IST)
ఐపీఎల్ 13వ సీజన్‌కు కరోనా చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే సీఎస్కే జట్టుకు కరోనా కాటు తప్పలేదు. ఆగస్టు 21న దుబాయ్‌కి వెళ్లిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంది. అదే సమయంలో ఇద్దరు ఆటగాళ్లు 11 మంది సహాయక సిబ్బంది కరోనా బారిన పడడంతో ఆ జట్టులో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలోనే రైనా భారత్‌కు తిరిగి వెళ్లిపోవడంతో అనేక ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. 
 
అతడు కరోనాకు భయపడి వెనుదిరిగాడని, అలాగే హోటల్‌ గది నచ్చక జట్టుతో విభేదాలు వచ్చాయని, మరోవైపు పంజాబ్‌లో తన మేనత్త కుటుంబంలో చోటుచేసుకున్న విషాదం నేపథ్యంలో వచ్చాడంటూ అనేక కథనాలు ప్రసారమయ్యాయి.
 
చివరికి సీఎస్కే యజమాని శ్రీనివాసన్‌ కూడా అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడనే ఊహాగానాలూ వచ్చాయి. వీటన్నింటిపై స్పందించిన రైనా గురువారం ఓ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుత పరిస్థితుల్లో తన కుటుంబంతో ఉండడమే శ్రేయస్కరమని భావించి తిరిగి వచ్చినట్లు చెప్పాడు. అయితే ఐపీఎల్‌లో ఆడుతాడా లేదా అనేది తెలియాల్సింది.
 
ఈ నేపథ్యంలోనే ఓ అభిమాని ట్విటర్‌లో సీఎస్కేను ఒక ఆసక్తికర ప్రశ్న వేశాడు. ఈసారి మన వైస్‌ కెప్టెన్‌ ఎవరని అడిగాడు. దానికి స్పందించిన ఆ జట్టు అంతే ధీటుగా సమాధానమిచ్చింది. మనకు తెలివైన సారథి ధోనీ ఉండగా ఇక భయమెందుకు? అని తిరిగి ప్రశ్నించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Netanyahu: డొనాల్డ్ ట్రంప్‌కు నెతన్యాహు కృతజ్ఞతలు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా.. ఎవరు?

అమెరికా ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. ట్రంప్ ఆరంభించారు.. మేం అంతం చేస్తాం..!

మేనత్త కొడుకుతో భార్య వివాహేతర సంబంధం... ఇద్దరూ కలిసి భర్తను చంపేశారు..

భార్యకు ప్రియుడుతో పెళ్లి చేయించిన హరిశ్చంద్ర!!

ఏపీలో నేడు - రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

తర్వాతి కథనం
Show comments