Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీకలు తెగ్గోస్తుంటే పాక్‌తో శాంతి చర్చలా? : గౌతం గంభీర్

భారత క్రికెటర్ గౌతం గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో పాకిస్థాన్ వారు భారత సైనికులను చంపుతూ ఉంటే, శాంతి చర్చలు చేయాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదని తేల్చి చెప్పారు.

Webdunia
శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (11:07 IST)
భారత క్రికెటర్ గౌతం గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో పాకిస్థాన్ వారు భారత సైనికులను చంపుతూ ఉంటే, శాంతి చర్చలు చేయాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదని తేల్చి చెప్పారు. అంతేకాకుండా, పాకిస్థానీయులను భారత్‌లో కాలు పెట్టకుండా నిషేధం విధించాలని టీమిండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్ డిమాండ్ చేశారు.
 
ఇదే అంశంపై ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ స్పందిస్తూ, క్రికెట్‌తో పాటు సినిమాలు, సంగీతం తదితర అన్ని రంగాల్లోనూ పాక్, భారత్‌ల మధ్య సంబంధాలు వద్దని హితవు పలికారు. పరిస్థితులు కొలిక్కి వచ్చి, పాక్‌కు బుద్ధి వచ్చేంత వరకూ వారిని ఇండియాలోకి రానీయకపోవడమే మంచిదన్నదే తన అభిప్రాయమన్నారు. 
 
గత యేడాది సుక్మా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వీరమరణం పొందిన సైనికుల పిల్లల విద్యకు అవసరమయ్యే ఖర్చును సాయంగా అందించిన గంభీర్, గత రాత్రి వారితో కలసి డిన్నర్ చేశాడు. పాక్ రేంజర్లను సైన్యం చంపడంలో తప్పులేదని అభిప్రాయపడ్డ గంభీర్, సహనానికి కూడా హద్దు ఉంటుందని, శాంతి చర్చలని ఓ వైపు చెబుతూ, మరోవైపు సరిహద్దుల్లో దాష్టీకానికి దిగుతున్న పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం నేర్పాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments