Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీకలు తెగ్గోస్తుంటే పాక్‌తో శాంతి చర్చలా? : గౌతం గంభీర్

భారత క్రికెటర్ గౌతం గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో పాకిస్థాన్ వారు భారత సైనికులను చంపుతూ ఉంటే, శాంతి చర్చలు చేయాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదని తేల్చి చెప్పారు.

Webdunia
శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (11:07 IST)
భారత క్రికెటర్ గౌతం గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో పాకిస్థాన్ వారు భారత సైనికులను చంపుతూ ఉంటే, శాంతి చర్చలు చేయాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదని తేల్చి చెప్పారు. అంతేకాకుండా, పాకిస్థానీయులను భారత్‌లో కాలు పెట్టకుండా నిషేధం విధించాలని టీమిండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్ డిమాండ్ చేశారు.
 
ఇదే అంశంపై ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ స్పందిస్తూ, క్రికెట్‌తో పాటు సినిమాలు, సంగీతం తదితర అన్ని రంగాల్లోనూ పాక్, భారత్‌ల మధ్య సంబంధాలు వద్దని హితవు పలికారు. పరిస్థితులు కొలిక్కి వచ్చి, పాక్‌కు బుద్ధి వచ్చేంత వరకూ వారిని ఇండియాలోకి రానీయకపోవడమే మంచిదన్నదే తన అభిప్రాయమన్నారు. 
 
గత యేడాది సుక్మా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వీరమరణం పొందిన సైనికుల పిల్లల విద్యకు అవసరమయ్యే ఖర్చును సాయంగా అందించిన గంభీర్, గత రాత్రి వారితో కలసి డిన్నర్ చేశాడు. పాక్ రేంజర్లను సైన్యం చంపడంలో తప్పులేదని అభిప్రాయపడ్డ గంభీర్, సహనానికి కూడా హద్దు ఉంటుందని, శాంతి చర్చలని ఓ వైపు చెబుతూ, మరోవైపు సరిహద్దుల్లో దాష్టీకానికి దిగుతున్న పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం నేర్పాలని కోరారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments