కీరవాణి ఇంటర్వ్యూ : 'దిక్కులు చూడకు రామయ్య'పై కామెంట్స్..

Webdunia
మంగళవారం, 7 అక్టోబరు 2014 (16:40 IST)
'దిక్కులు చూడకు రామయ్య' చిత్రానికి సంగీతం సమకూర్చిన ఎంఎం కీరవాణి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇతర సంగీత దర్శకుల గురించి వ్యాఖ్యానించడం నా అభిమతం కాదు. ఎవరిష్టం వచ్చినవాళ్లతో వాళ్లు పాడించుకుంటారు. బేసిక్‌గా నాకు తెలుగువాళ్లతో పాడించడం ఇష్టం. ఇప్పుడీ చిత్రంలోని పాటలన్నీ పాడింది తెలుగు గాయనీ గాయకులే. ఫలానా సింగర్ పాడితేనే బాగుంటుందని నాకనిపించే ఏకైక గాయకుడు ‘బాలుగారు’. ఆయన కోసం మాత్రమే ఆగిన సందర్భాలున్నాయి’ అని కీరవాణి చెప్పారు.
  
కాగా, త్రికోటి దర్శకత్వంలో వారాహి చలన చిత్రం పతాకంపై సాయి శివాని సమర్పణలో సాయి కొర్రపాటి నిర్మించిన చిత్రం ‘దిక్కులు చూడకు రామయ్య’ ఈ శుక్రవారం విడుదల కానుంది. నా కెరీర్ ఆరంభం నుంచి అవసరాన్ని బట్టి పెద్ద, చిన్న సినిమాలు చేస్తున్నాను. నాకు చిన్నా, పెద్దా అనే వ్యత్యాసం నాకు లేదన్నారు. అందువల్లే ‘దిక్కులు చూడకు రామయ్య’ సినిమాకి ఏం అవసరమో ఆ పరిధిలో ఒదిగిపోయి చేశాను.
 
'ఈగ'లో సుదీప్ నటన నాకు బాగా నచ్చిందని, ఈ చిత్రంలో అజయ్ నటన అంతకంటే బాగా నచ్చిందని చెప్పారు. సాయి కొర్రపాటితో ‘ఈగ’ సమయంలోనే నాకు మంచి అవగాహన ఏర్పడింది. ఏ నిర్మాత అయినా నన్ను నమ్మితే నేను సౌకర్యవంతంగా సినిమా చేస్తానని చెప్పారు. సాయి కొర్రపాటి కూడా ఆ కోవకు చెందిన నిర్మాతే అని వివరించారు.  
అన్నీ చూడండి

తాజా వార్తలు

CPI Narayana: కేంద్ర బడ్జెట్‌ పనికిరానిది.. దార్శనికత లేనిది.. నారాయణ

హైదరాబాద్ నుంచి చెన్నైకి 3 గంటల్లో, బెంగళూరుకి 2 గంటల్లో... రైల్లోనే...

ట్రంప్ ఏం నోటితో గ్రీన్ ల్యాండ్ కావాలని అన్నాడో కానీ... అది కాస్తా కరిగిపోతోంది, ముప్పు అంచున ప్రపంచం

చెత్తతో నిండిన ఒక పాడుబడిన బావిలో ముక్కలు ముక్కలుగా మృతదేహం

జగన్‌ను ఉరికించి తరిమాం, రోజా మా దెబ్బకు పారిపోయింది: జీవన్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

సాధారణ దగ్గు, జలుబు వదిలించుకునే మార్గం

Show comments