Webdunia - Bharat's app for daily news and videos

Install App

జెలెన్ స్కీ కీలక నిర్ణయం - ఉక్రెయిన్‌లో మార్షల్ లా పొడగింపు

Webdunia
బుధవారం, 16 మార్చి 2022 (10:02 IST)
రష్యన్ బలగాలు తమ దేశ రాజధాని కీవ్‌ను అతిత్వరలోనే వశం చేసుకునే అవకాశం ఉండటంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో మరో 30 రోజుల పాటు మార్షల్ లా పొడగించేలా బిల్లును ప్రవేశపెట్టారు. రిజర్వు బలగాల కోసం 18 నుంచి 60 యేళ్లలోపు ఆరోగ్యంగా ఉన్న పురుషులు ఉక్రెయిన్ దేశం వదిలి వెళ్లేందుకు అనుమతి లేదని ప్రకటించారు. 
 
అంతేకాకుండా రష్యన్ బలగాలు చుట్టుముట్టిన ప్రాంతాల నుంచి సామాన్య పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా 9 మానవతా కారిడార్ల ఏర్పాటుకు ఉక్రెయిన్ చర్యలు తీసుకుంది. మరియుపోల్ నగరానికి సహాయక సామాగ్రి చేరవేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. 
 
మరోవైపు, ఈ యుద్ధం ఇప్పటికే 20 రోజుల వరకు సాగింది. అయితే, మరో పది రోజుల్లో ముగిసే అవకాశం ఉంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని రష్యన్ బలగాలు స్వాధీనం చేసుకున్నట్టయితే ఈ యుద్ధం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అయితే, రష్యన్ బలగాలు తీవ్రమైన వనరుల కొరతను ఎదుర్కొంటుంది. దీంతో రష్యన్ సేనలు దాడులను స్వయంగా విరమించుకునే అవకాశాలు లేకపోలేదని యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ యూరప్ మాజీ కమాండింగ్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ బెన్ హోగ్స్ అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments