Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడ్చినందుకు కూడా బిల్లు ఆస్పత్రి యాజమాన్యం

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (07:57 IST)
అమెరికాలో ఓ ఆస్పత్రి చేసిన పని ప్రతి ఒక్కరూ నవ్వుకుంటున్నారు. పుట్టుమచ్చలను తొలగించుకునేందుకు ఆస్పత్రిలో చేర్చిన యువతి ఆపరేషన్ భయంతో ఏడ్చినందుకు కూడా బిల్లు వేసింది. ప్రస్తుతం ఈ బిల్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అమెరికాలో మిడ్జ్ అనే యువతి ఆసుపత్రికి వెళ్లింది. ఒక పుట్టుమచ్చ (మోల్) తొలగించుకోవడానికి చేరగా, ఆపరేషన్ చేసి పుట్టుమచ్చ తొలగించారు. ఆపరేషన్ సమయంలో భయమేసిన ఆమె ఏడ్చింది. ఆ తర్వాత ఆపరేషన్ సక్సెస్ అయింది. డిశ్చార్జి సమయంలో ఆమెకు బిల్లు వేశారు. ఆ బిల్లు చూసిన ఆమెకు ఆశ్చర్యమేసింది.
 
ఎందుకంటే ఆ బిల్లులో ఆమె ఏడ్చినందుకు కూడా బిల్లు వేశారు. దీన్ని ఫొటో తీసిన ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాన్ని చూసిన నెటిజన్లు అమెరికా ఆరోగ్య వ్యవస్థపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ వ్యవస్థ గురించి అందరికీ అవగాహన కల్పించేందుకే ఈ ఫొటో షేర్ చేసినట్లు చెప్పింది. 
 
ఏడ్చినందుకు కూడా బిల్లు వేస్తారని తను అసలు ఊహించలేదని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ బిల్లు ఒక్కటి చాలు అమెరికన్ హెల్త్‌కేర్ వ్యవస్థ ఎలా ఉందో చెప్పడానికి అని కొందరు కామెంట్ చేస్తుంటే మరికొందరేమో 'ఇంతకాలం నేను ఫ్రీగా ఏడ్చానని అనుకున్నా' అంటూ జోకులు పేలుస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments