Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాగులో బాంబు వుందని జోక్ చేసింది.. అంతే.. కోర్టులో నిలబెట్టారు..

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (18:37 IST)
ఓ మహిళ పిచ్చి ప్రవర్తన కారణంగా విమానాశ్రయంలో హడావుడి చోటుచేసుకుంది. ఆమెను ఎక్కిన ఫ్లైటు దించి తనిఖీలు చేపట్టారు. ఆ తర్వాత అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. విక్టోరియా దేశానికి చెందిన రిచెల్లీ మారిస్సా(42) అనే మహిళ వర్జిన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఎక్కే సమయంలో తన బ్యాగ్‌లో బాంబు ఉందని, అధికారులను, ప్రయాణీకులను హడలెత్తించింది. వెంటనే పోలీసులు ఆమె లగేజీని తనిఖీ చేశారు. తాను సరదాగా జోక్ చేసానని చెప్పింది.  
 
అలా చెబితే ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఈ పని చేశానని చెప్పింది. దీనికి సీరియస్ అయిన అధికారులు ఆమెను కోర్టులో హాజరుపరిచారు. గతంలో ఓ కారు డ్రైవరు తనకు ఈ జోక్ చెప్పాడని అందుకే విమానం ఎక్కే ముందు ఆ విధంగా ప్రవర్తించానని మహిళ కోర్టులో చెప్పింది. ఎవరో చెప్పారని చట్టంతో చలాగాటాలాడటం నేరమని ఆమెకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. 
 
గత సంవత్సరం డిసెంబర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం ఆమె కోర్టులో నేరాన్ని అంగీకరించి విమానాశ్రయ అధికారులకు క్షమాపణ చెప్పింది. ఆమె మానసిక పరిస్థితి బాగాలేకే ఇలా ప్రవర్తించిందని గుర్తించిన కోర్టు ఆమెకు 800 డాలర్ల జరిమానా విధించి వదిలేసింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments