రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

ఐవీఆర్
బుధవారం, 7 మే 2025 (23:19 IST)
ప్రపంచంలోనే శాంతియుత దేశంగా పేరున్న భారతదేశాన్ని సీమాంతర ఉగ్రవాదులతో అమాయక పౌరులపై పిరికిపంద దాడులు చేస్తూ సహనాన్ని పరీక్షిస్తోన్న పాకిస్తాన్ ముక్కలు చెక్కలయ్యే రోజులు వచ్చేసాయంటున్నారు నిపుణులు. దేశ ప్రజల అభివృద్ధి మానేసి మందుగుండు సామాగ్రి, ఉగ్రవాదులకు రాచమర్యాదలు చేస్తూ పాక్ ప్రజలను బిచ్చగాళ్లలా మార్చేసింది పాకిస్తాన్. ఫలితంగా ఆ దేశంలో సింహభాగం ప్రజలు తీవ్ర అసంతృప్తితో వున్నారు. వారికి ఎవరికీ యుద్ధం అవసరంలేదు.
 
ఒకానొక సమయంలో పాక్ పౌరుల్లో చాలామంది తమకు కూడా మోడీ లాంటి ప్రధాని కావాలంటూ బాహాటంగానే చెప్పేశారంటే అక్కడి ప్రజల్లో అసంతృప్తి ఎంతమేరకు వున్నదో అర్థమవుతుంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ భూభాగంలో 40 శాతం వున్న బెలూచిస్తాన్, తాము పాకిస్తాన్ దేశంతో కలిసి వుండబోమనీ, తమకు ప్రత్యేక దేశం కావాలంటూ చాలా ఏళ్లుగా కొట్లాడుతోంది. ఇప్పుడు ఆ సమయం వచ్చేసిందంటున్నారు నిపుణులు.
 
పాకిస్తాన్ దేశం నుంచి విడిపోయి సంతోషకరమైన జీవనం సాగించాలని అక్కడి ప్రజలు అనుకుంటున్నారు. ఇందులో భాగంగా వారు భారతదేశం మద్దతు కోసం ఎదురుచూస్తున్నారు. ఇండియా మద్దతుతో పాకిస్తాన్ దేశం నుంచి తమ ముక్కను తాము తన్నుకెళ్లేందుకు బెలూచిస్తాన్ సిద్ధంగా వున్నట్లు సమాచారం. కనుక వచ్చే 48 గంటల్లో యుద్ధం మాట దేవుడెరుగు పాకిస్తాన్ విచ్ఛిన్నం కాకుండా వుంటే చాలన్న ధోరణిలో అక్కడివారు వున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments