Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్ అంశం లేకుండా భారత్‌తో చర్చలా.. నో ఛాన్స్ : పాకిస్థాన్

Webdunia
మంగళవారం, 13 జనవరి 2015 (17:39 IST)
కాశ్మీర్ అంశం లేకుండా భారత్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని పాకిస్థాన్ తెగేసి చెప్పింది. ఇరు దేశాలు శాంతి చర్చలను కొనసాగించాలని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ సూచించిన నేపథ్యంలో పాకిస్థాన్ మంగళవారం పై విధంగా స్పందించింది. వ్యూహాత్మక ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా జరిగిన చర్చల అనంతరం జాన్ కెర్రీ, పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాశ్మీర్ అంశం లేకుండా భారత్‌తో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. అదేసమయంలో ఉభయ దేశాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి తమవంతుగా చొరవు తీసుకుంటున్నట్టు చెప్పారు.
 
అనంతరం జాన్ కెర్రీ స్పందిస్తూ.. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య సరిహద్దుల్లో నెలకొంటున్న ఉద్రిక్తతలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సరిహద్దు వెంబడి, నియంత్రణ రేఖ వెంబడి ఇటీవలి కాలంలో హింస పెరగడం పట్ల తాము ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. పాకిస్థాన్, భారత ప్రయోజనాల దృష్ట్యా ఇరు దేశాలు సత్సంబంధాలతో ముందుకు సాగాలని ఆయన కోరారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments