స్కూల్ మూసి వేస్తారనీ గొర్రెలకు అడ్మిషన్లు.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 10 మే 2019 (08:35 IST)
ప్రతిచోటా పాఠశాలలకు వెళ్లే చిన్నారుల సంఖ్య తగ్గిపోతోంది. దీంతో అనేక పాఠశాలలు మూసివేస్తున్నారు. వీటిలో ప్రభుత్వ పాఠశాలలు కూడా ఉన్నాయి. అలాగే, మధ్యలో స్కూల్ మానేస్తున్న వారి సంఖ్య (డ్రాపౌట్స్) కూడా ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఒకటి రెండు పాఠశాలలను కలిపి ఒకే స్కూలుగా చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ స్కూల్‌లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీంతో స్కూల్‌ను వేస్తారనే ప్రచారం జరిగింది. దీంతో పాఠశాల యాజమాన్యానికి అద్భుతమైన ఆలోచన వచ్చిందే తడవుగా గొర్రెలకు అడ్మిషన్లు కల్పించారు. ఈ విచిత్ర సంఘటన ఫ్రాన్స్‌లోని అల్ఫ్స్ ప్రాంతం, కేట్స్ ఎన్ బెల్లెడోన్నె అనే గ్రామంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామంలో ఓ పాఠశాల ఉంది. ఇందులో ఒకటి నుంచి 11వ తరగతి వరకు క్లాసులు ఉన్నాయి. వీటిలో ఒక క్లాసులో విద్యార్థుల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. దీంతో ఆ తరగతిని మూసి వేయాలని స్కూల్ మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. అలా చేస్తే వారి విద్యాసంవత్సరం వేస్ట్ అవుతుంది. ఇది తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. తరగతిని మూసివేయకుండా ఉండేందుకు వీలుగా ఓ ఆలోచన చేశారు. 
 
తరగతితో విద్యార్థుల సంఖ్య తగ్గకుండా ఉండేందుకు 15 గొర్రెలకు పేర్లు పెట్టి.. వాటిని ఆ క్లాసులోకి అడ్మిషన్స్ ఇప్పించారు. అంతేకాదు గొర్రెల జననధృవీకరణ పత్రాన్ని(బర్త్ సర్టిఫికెట్) చూపించి మరీ పేర్లు రిజిస్టర్ చేయించారు. ఈ వింత నిరసనతో ఎట్టకేలకు తమ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పిల్లల సంఖ్యపైకాకుండా.. వారి సంక్షేమం మీద శ్రద్ధ పెట్టాలని చురకలు అంటించారు. వాట్ యాన్ ఐడియా కదూ..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shah Rukh Khan: లండన్ లీసెస్ట‌ర్ స్క్వేర్‌లో షారూఖ్ ఖాన్‌, కాజోల్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments