Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Omicron సునామీలా విరుచుకుపడుతుంది : #WHO చీఫ్ సైంటిస్ట్

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (18:32 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ సునామీలా విరుచుకుపడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ హెచ్చరించారు. అందువల్ల ఈ వైరస్‌ను అంత తేలిగ్గా తీసుకోరాదని కోరారు. భారత్‌లో ఇప్పటికే 1200కు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని, అందువల్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఆమె కోరారు. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం భారత్‌లో ఒమిక్రాన్ కేసులు సాధారణంగానే ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో ఈ కొత్త వేరియంట్ కేసులు దేశంలో ఉప్పెనలా పెరగనున్నాయని తెలిపారు. చాలా మంది అనారోగ్యానికి గురవుతారని చెప్పారు. ఇదే జరిగితే భారత్‌లో మాత్రం మరోమారు వైద్య సేవల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. 
 
అలాగే, ప్రపంచ వ్యాప్తంగా ఈ కేసుల సంఖ్యతో పాటు.. ఆస్పత్రుల్లో చేరే ఇన్ పేషెంట్ల సంఖ్య కూడా పెరిగిందన్నారు. అందువల్ల అన్ని దేశాలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. ముఖ్యంగా, ఈ వైరస్‌ను ప్రతి  ఒక్కరూ సాధారణ జలుబులా తీసుకుంటున్నారని, ఇదే పెను ముప్పుకు దారితీస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments