Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Omicron సునామీలా విరుచుకుపడుతుంది : #WHO చీఫ్ సైంటిస్ట్

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (18:32 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ సునామీలా విరుచుకుపడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ హెచ్చరించారు. అందువల్ల ఈ వైరస్‌ను అంత తేలిగ్గా తీసుకోరాదని కోరారు. భారత్‌లో ఇప్పటికే 1200కు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని, అందువల్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఆమె కోరారు. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం భారత్‌లో ఒమిక్రాన్ కేసులు సాధారణంగానే ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో ఈ కొత్త వేరియంట్ కేసులు దేశంలో ఉప్పెనలా పెరగనున్నాయని తెలిపారు. చాలా మంది అనారోగ్యానికి గురవుతారని చెప్పారు. ఇదే జరిగితే భారత్‌లో మాత్రం మరోమారు వైద్య సేవల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. 
 
అలాగే, ప్రపంచ వ్యాప్తంగా ఈ కేసుల సంఖ్యతో పాటు.. ఆస్పత్రుల్లో చేరే ఇన్ పేషెంట్ల సంఖ్య కూడా పెరిగిందన్నారు. అందువల్ల అన్ని దేశాలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. ముఖ్యంగా, ఈ వైరస్‌ను ప్రతి  ఒక్కరూ సాధారణ జలుబులా తీసుకుంటున్నారని, ఇదే పెను ముప్పుకు దారితీస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 
 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments