చైనాను చుట్టేస్తున్న HMPV వైరస్, లక్షణాలేంటి? భారత్ పరిస్థితి ఏంటి?

ఐవీఆర్
శుక్రవారం, 3 జనవరి 2025 (18:21 IST)
చైనా (China) దేశంలో ప్రస్తుతం HMPV వైరస్ చుట్టబెడుతోంది. అక్కడ ఆసుపత్రులన్నీ ఈ వ్యాధిగ్రస్తులతో కిక్కిరిసిపోయి కనబడుతున్నారు. ప్రత్యేకించి కొన్నిచోట్ల స్మశానాలు కూడా రద్దీగా వున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కోవిడ్ -19 మహమ్మారి కోరల నుండి చైనా, భారతదేశంతో(India) సహా అనేక ఇతర దేశాలు కోలుకుని నాలుగు సంవత్సరాలు గడిచాయి. 2025లో మూడు రోజులుగా చైనాలో కొత్త మిస్టీరియస్ వైరస్ వ్యాప్తి భయాందోళనలకు గురిచేస్తోంది.
 
హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV)గా పిలిచే ఈ వైరస్ చైనాలో విస్తరిస్తోంది. దేశంలో హెచ్‌ఎమ్‌పివి కేసులు పెరుగుతున్నాయని, ముఖ్యంగా ఉత్తర ప్రావిన్స్‌లలో 14 ఏళ్లలోపు వారిలో పెరుగుతున్నట్లు రాయిటర్స్ నివేదించింది. ఆరోగ్య భయం మధ్య, వైరస్ భారతదేశాన్ని ప్రభావితం చేస్తుందా లేదా COVID-19 రోజులను తిరిగి తీసుకువస్తుందా అనే దానిపై ఊహాగానాలు ఉన్నాయి. HMPV లక్షణాలు తేలికపాటి జ్వరం, ముక్కు కారటం, దగ్గు వంటి సాధారణ జలుబు లేదా ఫ్లూ మాదిరిగానే ఉంటున్నాయి. కనుక మాస్కులు వేసుకుని కోవిడ్ సమయంలో పాటించిన జాగ్రత్తలు తీసుకుంటుంటే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ కూడా ఫోమైట్ ద్వారా సంక్రమిస్తుంది, అంటే ఇది సోకిన వ్యక్తి నుండి మరొకరికి లేదా వ్యాధి సోకిన వ్యక్తి తాకిన ప్రాంతపు ఉపరితలం నుండి మరొక వ్యక్తికి వ్యాపిస్తుంది. ఇది సోకిన వ్యక్తితో కరచాలనం చేయడం వంటి దగ్గరి పరిచయం నుండి, సోకిన వ్యక్తి యొక్క దగ్గు, తుమ్ముల నుండి వ్యాపిస్తుంది. కలుషితమైన ఉపరితలాలను తాకి, ఆపై ముఖాన్ని(నోరు, ముక్కు లేదా కళ్ళు) తాకడం కూడా HMPV వ్యాప్తికి దారితీయవచ్చు. వ్యాధి తీవ్రం దాల్చితే ప్రాణానికి ముప్పు ఏర్పడవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments