Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియాలో ఘోరకలి : మృతదేహాల గుట్టలు.. నేలకూలిన భవనాలు

Webdunia
ఆదివారం, 23 డిశెంబరు 2018 (15:07 IST)
ఇండోనేషియాలో ఘోరకలి సంభవించింది. సునామీ ప్రళయం సృష్టించింది. ఒక్కసారిగా సునామీ విరుచుకుపడటంతో ఏకంగా 168 మంది వరకు మృత్యువతాపడ్డారు. ఈ మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. అంతేనా, ఎటు చూసినా నేలకూలిన భవనాలు, గుట్టలు గుట్టులుగా మృతదేహాలు కనిపిస్తున్నాయి. అనేక మంది క్షతగాత్రులు రక్తమోడుతూ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. 
 
ఈ సునామీ సృష్టించిన విధ్వంసంతో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తీవ్ర సునామీ వల్ల చాలా మంది ప్రజలు శిథిలాల్లో చిక్కుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించి వెలికితీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సహాయం కోసం అర్ధిర్థిస్తున్న వారిని ఆదుకునేందుకు నీరు, ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ విలయం కారణంగా 168 మందికి పైగా చనిపోయారని అధికారులు ప్రకటించారు.
 
వందల సంఖ్యలో భవనాలు దెబ్బతిన్నాయని.. నష్టం ఎంతనేది ఇప్పుడే అంచనా వేయలేమని విపత్తుల నిర్వాహణ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. దక్షిణ సుమత్రా, పశ్చిమ జావాలో బీచ్‌ల్లో సునామీ సంభించిందని.. క్రాకటోవో దీవిలోని అగ్నిపర్వతం బద్ధలు కావడంతో ఈ విపత్తు వచ్చిందని తెలిపారు. లావా.. బూడిద 500 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడిందని, సునామీకి గల ఖచ్చితమైన కారణాలు తెలుసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments