Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియాలో ఘోరకలి : మృతదేహాల గుట్టలు.. నేలకూలిన భవనాలు

Webdunia
ఆదివారం, 23 డిశెంబరు 2018 (15:07 IST)
ఇండోనేషియాలో ఘోరకలి సంభవించింది. సునామీ ప్రళయం సృష్టించింది. ఒక్కసారిగా సునామీ విరుచుకుపడటంతో ఏకంగా 168 మంది వరకు మృత్యువతాపడ్డారు. ఈ మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. అంతేనా, ఎటు చూసినా నేలకూలిన భవనాలు, గుట్టలు గుట్టులుగా మృతదేహాలు కనిపిస్తున్నాయి. అనేక మంది క్షతగాత్రులు రక్తమోడుతూ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. 
 
ఈ సునామీ సృష్టించిన విధ్వంసంతో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తీవ్ర సునామీ వల్ల చాలా మంది ప్రజలు శిథిలాల్లో చిక్కుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించి వెలికితీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సహాయం కోసం అర్ధిర్థిస్తున్న వారిని ఆదుకునేందుకు నీరు, ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ విలయం కారణంగా 168 మందికి పైగా చనిపోయారని అధికారులు ప్రకటించారు.
 
వందల సంఖ్యలో భవనాలు దెబ్బతిన్నాయని.. నష్టం ఎంతనేది ఇప్పుడే అంచనా వేయలేమని విపత్తుల నిర్వాహణ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. దక్షిణ సుమత్రా, పశ్చిమ జావాలో బీచ్‌ల్లో సునామీ సంభించిందని.. క్రాకటోవో దీవిలోని అగ్నిపర్వతం బద్ధలు కావడంతో ఈ విపత్తు వచ్చిందని తెలిపారు. లావా.. బూడిద 500 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడిందని, సునామీకి గల ఖచ్చితమైన కారణాలు తెలుసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments