ఇండోనేషియాలో ఘోరకలి : మృతదేహాల గుట్టలు.. నేలకూలిన భవనాలు

Webdunia
ఆదివారం, 23 డిశెంబరు 2018 (15:07 IST)
ఇండోనేషియాలో ఘోరకలి సంభవించింది. సునామీ ప్రళయం సృష్టించింది. ఒక్కసారిగా సునామీ విరుచుకుపడటంతో ఏకంగా 168 మంది వరకు మృత్యువతాపడ్డారు. ఈ మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. అంతేనా, ఎటు చూసినా నేలకూలిన భవనాలు, గుట్టలు గుట్టులుగా మృతదేహాలు కనిపిస్తున్నాయి. అనేక మంది క్షతగాత్రులు రక్తమోడుతూ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. 
 
ఈ సునామీ సృష్టించిన విధ్వంసంతో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తీవ్ర సునామీ వల్ల చాలా మంది ప్రజలు శిథిలాల్లో చిక్కుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించి వెలికితీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సహాయం కోసం అర్ధిర్థిస్తున్న వారిని ఆదుకునేందుకు నీరు, ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ విలయం కారణంగా 168 మందికి పైగా చనిపోయారని అధికారులు ప్రకటించారు.
 
వందల సంఖ్యలో భవనాలు దెబ్బతిన్నాయని.. నష్టం ఎంతనేది ఇప్పుడే అంచనా వేయలేమని విపత్తుల నిర్వాహణ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. దక్షిణ సుమత్రా, పశ్చిమ జావాలో బీచ్‌ల్లో సునామీ సంభించిందని.. క్రాకటోవో దీవిలోని అగ్నిపర్వతం బద్ధలు కావడంతో ఈ విపత్తు వచ్చిందని తెలిపారు. లావా.. బూడిద 500 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడిందని, సునామీకి గల ఖచ్చితమైన కారణాలు తెలుసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

మెగా ఆఫర్ కొట్టేసిన మలయాళ బ్యూటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments