Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే నెలలో భారత్‌లో పర్యటించనున్న డోనాల్డ్ ట్రంప్

Webdunia
మంగళవారం, 14 జనవరి 2020 (13:05 IST)
అగ్రరాజ్యం అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని అమెరికా దౌర్య వర్గాలు వెల్లడించాయి. వాషింగ్టన్ నుంచి వచ్చే సెక్యూరిటీ అండ్ లాజిస్టిక్ టీమ్స్ వచ్చే వారంలో ఇండియాకు వచ్చి, ట్రంప్ పర్యటనకు ఏర్పాట్లను పరిశీలించనున్నట్టు తెలిపాయి.
 
వాస్తవానికి డోనాల్డ్ ట్రంప్ పర్యటనకు సంబంధించి అధికారిక ప్రకటన వెల్లడికాలేదు. కాగా, ఈ సంవత్సరం రిపబ్లిక్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరగా, ట్రంప్ సున్నితంగా తిరస్కరించారన్న సంగతి తెలిసిందే.
 
ఇదే సమయంలో తాను మరోమారు భారత్‌కు వస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీని జనవరి 7న జరిగిన ఫోన్ సంభాషణల్లో మోడీ ప్రస్తావించినట్టు సమాచారం. ఆ వెంటనే ట్రంప్ భారత పర్యటనకు ఏర్పాట్లు చేయాలని సూచించినట్టు వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి చివరి వారంలో ఈ పర్యటన ఉండవచ్చని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షి ష్రింగ్లా వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments