Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో కొనసాగుతున్న కాల్పుల మోత - మరో ముగ్గురు హతం

Webdunia
బుధవారం, 25 జనవరి 2023 (10:33 IST)
అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల మోత మోగుతోంది. దుండగులు తుపాకీతో చెలరేగిపోతున్నారు. తాజాగా ఓ దండగుడు ముగ్గురిని కాల్చి చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన యకీమాలోని కన్వీనియన్స్‌ స్టోర్‌లో జరిగింది. ఆత్మహత్య చేసుకున్న నిందితుడి వయసు 21 యేళ్ళు. 
 
కాలిఫోర్నియాలోని హాఫ్ మూన్ బే పట్టణంలో రెండు రోజుల క్రితం ఓ వ్యవసాయ కార్మికుడు సహచరులపై జరిపిన కాల్పుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. మృతులంతా చైనీయులే. అంతకుముందు మోంటెరీ పార్క్ నగరంలో చైనా న్యూ ఇయర్ వేడుకల్లో జరిగిన కాల్పుల్లో పది మంది చనిపోయారు. 
 
ఈ రెండు ఘటనలను మరచిపోకముందే వాషింగ్టంన్‌లోని యకీమా నగరంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నిందితుడు ముగ్గురిని కాల్చి చంపిన కొన్ని గంటల తర్వాత పోలీసులు చుట్టుముట్టడంతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సర్కిల్ కె. మార్కెట్‌లో తెల్లవారుజామున 3.30 గంటలకు ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడిని యకీమా కౌంటీకి చెందిన 21 యేలఅల జారిడ్ హడాక్‌గా గుర్తించారు. కాగా, ఈ యేడాది ఇప్పటివరకు అమెరికాలో జరిగిన 39 కాల్పుల ఘటనలు జరిగినట్టు పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments