Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాష్టింగన్ రెస్టారెంట్ వద్ద భారతీయుడిపై దాడి... తీవ్రంగా గాయపడి మృతి

ఠాగూర్
శనివారం, 10 ఫిబ్రవరి 2024 (11:23 IST)
అగ్రరాజ్యం అమెరికాలో భారతీయులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ యేడాది జనవరి నెల ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు వివిధ ప్రాంతాల్లో జరిగిన దాడులు, అనుమానాస్పద ఘటనల్లో ఏకంగా ఆరుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో భారతీయుడిపై దాడు జరిగింది. వాషింగ్టన్ రెస్టారెంట్ వద్ద జరిగిన ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వివేక్ అనే వ్యక్తి చనిపోయాడు. మృతుడుని వర్జీనియాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ దాడి ఈ నెల రెండో తేదీన జరగరింది. బాధితుడిని కిందపడేసిన నిందితుడు ఆపై తలను నేలకేసి బాదాడు. దీంతో వివేక్ తీవ్రంగా గాయపడ్డాడు. 
 
41 ఏళ్ల తనేజా అర్థరాత్రి రెండు గంటలు దాటాక రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చి వీధిలోంచి నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, ఈ ఘటన వెనకున్న కారణమేంటన్నది తెలియరాలేదని పోలీసులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి బాధితుడు స్పృహ కోల్పోయి పడివున్నాడు. తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తనేజా గురువారం ప్రాణాలు విడిచాడు.
 
దీనిపై అమెరికా పోలీసులు కేసు నమోదు చేసి ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడి కోసం వేట మొదలుపెట్టారు. నిందితుడికి సంబంధించిన వివరాలు చెప్పిన వారికి 25 వేల డాలర్ల బహుమతి ప్రకటించారు. ఈ వారం ఆరంభంలో షికాగోలో హైదరాబాద్‌ నగరానికి చెందిన ఐటీ విద్యార్థి సయ్యద్ ముజాహిద్ అలీపై దాడిచేసి దుండగులు దోచుకున్నారు. అమెరికాలో ఇప్పటికే శ్రేయాస్ రెడ్డి బెనిగెర్ (19), నీల్ ఆచార్య, వివేక్ సైనీ (25), అకుల్ ధావన్ మృతి చెందారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments