Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా న్యాయ శాఖలో భారత సంతతి మహిళ!

Webdunia
బుధవారం, 22 అక్టోబరు 2014 (18:24 IST)
అమెరికా న్యాయశాఖలో భారత సంతతికి చెందిన ఓ మహిళకు కీలక బాధ్యతలు కట్టబెట్టాయి. గతంలో అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌథంలో సైబర్ సంబంధింత వ్యవహారాలను పర్యవేక్షించిన ప్రవాస భారతీయురాలు అనితా ఎం సింగ్, తాజాగా ఆ దేశ న్యాయశాఖలోని జాతీయ భద్రతా విభాగం (ఎన్ఎస్‌డీ)లో చీఫ్ ఆఫ్ స్టాఫ్ అండ్ కౌన్సిలర్‌గా బాధ్యతలు చేపట్టారు. 
 
పెన్సిల్వేనియా వర్సిటీ న్యాయశాఖ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా సాధించిన అనితా సింగ్, సైబర్ ఆధారిత వ్యవహారాల్లో విశేష అనుభవాన్ని గడించారు. జాతీయ భద్రత విభాగాన్ని సమూలంగా ప్రక్షాళన చేసే దిశలో భాగంగా అనితా సింగ్ నియామకాన్ని చేపట్టినట్లు ఆ శాఖ అసిస్టెంట్ అటార్నీ జనరల్ జాన్ కార్లిన్ చెప్పారు 
 
భవిష్యత్తులో ఆ దేశానికి పలు విభాగాల్లో ఎదురుకానున్న సమస్యలకు చెక్ పెట్టేందుకు కొత్త వ్యూహాల రచనలో అనితా సింగ్ కీలక భూమిక పోషిస్తారని ఆయన వెల్లడించారు. 2011లో ఎన్ఎస్‌డీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా బాధ్యతలు చేపట్టిన అనితా సింగ్, ఏడాదిన్నరగా ఎన్ఎస్‌డీకి యాక్టింగ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా వ్యవహరిస్తూ రాగా, ఈ నియామకంతో ఇకనుంచి పూర్తి స్థాయి చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా వ్యవహరిస్తారు. 

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments