అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్కు ఓ భారతీయుడు ఆర్థిక సాయం చేశాడట. పాకిస్థాన్లోని అబ్బొట్టాబాద్లో లాడెన్ను కాల్చి చంపాక యూఎస్ నేవీ సీల్స్ అక్కడి నుంచి పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ముఖ్యంగా లభ్యమైన ఓ 'స్ప్రెడ్ షీట్' కీలకమైన విషయాన్ని బయటపెట్టింది.
మదీనాలోని ఓ భారతీయుడు లాడెన్కు ఆర్థిక సాయం అందజేసిన వివరాలు అందులో ఉన్నాయి. లాడెన్ అతడిని 'ఇండియన్ బ్రదర్ ఇన్ మదీనా'గా పేర్కొనడంతో అందరిలోనూ ఆసక్తి రేకెత్తింది. 2009 మే, జులై మాసాల మధ్య ఆ 'ఇండియన్ బ్రదర్' లక్షల రూపాయలు లాడెన్కు పంపినట్టు వెల్లడైంది.
అదేవిధంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, కువైట్కు చెందిన మద్దతుదారుల నుంచే భారీ మొత్తాల్లో సొమ్ము అల్ ఖైదాకు అందినట్టు యూఎస్ మెరైన్లు స్వాధీనం చేసుకున్న పత్రాలు చెబుతున్నాయి.