Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైకు నడిపే విమానాలు రద్దు చేసిన అమెరికా.. ఎందుకు?

Webdunia
శుక్రవారం, 21 జూన్ 2019 (13:29 IST)
భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై - అమెరికాల మధ్య నడిచే విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. ఈ మేరకు యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ సర్వీసెస్ అత్యవసర ఆదేశాలు జారీచేసింది. అయితే, ఈ తరహా ఆదేశాలు జారీచేయడానికి కారణాలు లేకపోలేదు.
 
గత కొన్ని రోజులుగా అమెరికా - ఇరాన్‌ల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. ముఖ్యంగా ట్రేడ్‌వార్ సాగుతోంది. ఈ పరిస్థితుల్లో అమెరికాకు చెందిన డ్రోన్ ఒకటి తమ భూభాగంలోకి ప్రవేశించిందని ఇరాన్ పేర్కొని, ఆ డ్రోన్‌ను కూల్చివేసింది. దీంతో అమెరికా - ఇరాన్‌ల మధ్య ఉద్రిక్త ఆదేశాలు నెలకొన్నాయి. 
 
ఈ కారణంగా ఇరాన్ గగనతలం మీదుగా అమెరికా విమానాలు వెళ్లొద్దని ఫెడరల్ ఏవియేషన్ విభాగం ఆదేశాలు జారీచేసింది. ఫలితంగా ముంబై - అమెరికాల మధ్య నడిచే విమానాలను రద్దు చేసింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికా అధికారులు వెల్లడించారు. 
 
పైగా, ప్రయాణికులు ప్రత్యామ్యాయ చర్యలు తీసుకోవాలని సలహా ఇచ్చారు. దీంతో యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌తో పాటు అమెరికన్ ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్‌లైన్స్‌లు ఇరాన్ గగనతలం మీదుగా ప్రయాణించే అన్ని విమాన సర్వీసులను రద్దు చేశాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments