Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌కు విజయ్ మాల్యా.. ఇక వారెంట్ జారీ చేయాల్సిందే తరువాయి..

బ్యాంకు రుణాలను కట్టలేక విదేశాలకు జంప్ అయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను భారత దేశానికి రప్పించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే విజయ్ మాల్యాను అప్పగించాల్సిందిగా భారత్ చేసిన అభ్యర్థనను బ్రిటన్ విదేశ

Webdunia
శనివారం, 25 మార్చి 2017 (09:25 IST)
బ్యాంకు రుణాలను కట్టలేక విదేశాలకు జంప్ అయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను భారత దేశానికి రప్పించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే విజయ్ మాల్యాను అప్పగించాల్సిందిగా భారత్ చేసిన అభ్యర్థనను బ్రిటన్ విదేశాంగ శాఖ గత నెల 21వ తేదీన సర్టిఫై చేసేసింది. సర్టిఫై చేసిన అభ్యర్ధనను వెస్ట్‌ మినిస్టర్‌ మేజిస్ట్రే‌ట్‌ కోర్టుకు పంపించారు. ఇక మిగిలింది.. విజయ్ మాల్యాను అదుపులోకి తీసుకునేందుకు.. అలాగే భారత్‌కు అప్పగించేందుకు వీలుగా జిల్లా జడ్జి స్థాయి న్యాయాధికారి వారెంట్ జారీ చేయాల్సిందే. 
 
బ్యాంకులకు దాదాపు 9,000 కోట్ల రూపాయల మేర రుణాలను ఎగవేసి రాత్రికిరాత్రే విజయ్ మాల్యా లండన్‌కు పరారైన సంగతి తెలిసిందే. ఒక దేశానికి చెందిన నేరగాళ్లు, చట్టం కనుగప్పి పరారైన వ్యక్తులు మరో దేశంలో ఆశ్రయం తీసుకున్న పక్షంలో, వారిని బంధించి అప్పగించేందుకు భారత, బ్రిటన్‌ మధ్య ద్వైపాక్షిక ఒప్పందం ఎప్పటి నుంచో అమల్లో ఉంది. ఈ చట్టం కిందనే మాల్యాను భారత్‌కు రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments