Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళకు చెందిన వ్యక్తికి రూ.45కోట్ల జాక్ పాట్

Webdunia
శుక్రవారం, 17 నవంబరు 2023 (13:15 IST)
యూఏఈలో ఉంటున్న కేరళ వాసి జీవితం ఒక్కరోజులో మారిపోయింది. అక్కడ నిర్వహించిన లాటరీలో ఆ వ్యక్తికి 45 కోట్ల రూపాయల జాక్‌పాట్ తగిలింది. ఈ వార్త విని షాక్ అయ్యాడు.
 
కేరళకు చెందిన 39 ఏళ్ల శ్రీజు 11 ఏళ్ల క్రితం యూఏఈకి వలస వెళ్లాడు. అక్కడ ఓ ఆయిల్ కంపెనీలో కంట్రోల్ రూమ్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఇంతలో, మహ్జూజ్ సాటర్డే మిలియన్స్ డ్రా కోసం టిక్కెట్ కొన్నాడు. బుధవారం లాటరీ డ్రా జరిగింది. ఆ తర్వాత శ్రీజు జీవితం మారిపోయింది.
 
ఆ లాటరీలో శ్రీజుకు 45 కోట్ల జాక్‌పాట్ వచ్చింది. ఈ సందర్భంగా శ్రీజు మాట్లాడుతూ.. "అప్పుడు నేను కారులో ఉన్నాను. నేను నా మహ్జూజ్ ఖాతాను చూడాలని భావించి దాన్ని తెరిచాను. నా కళ్ళు తిరిగాయి. నేను గెలిచానని నమ్మలేకపోయాను. మహ్జూజ్ సిబ్బంది ఫోన్ చేసి చెప్పే వరకు నేను నమ్మలేదు" అని శ్రీజూ చెప్పారు.
 
అరబ్ దేశాల్లో ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు. అక్కడ డ్రా చేసే లాటరీల్లో చాలా మంది జాక్‌పాట్ కొట్టేస్తున్నారు. ఈ వార్త ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తోంది.
 
ఈ మహ్జూజ్ లక్కీ డ్రాలో మరో భారతీయుడు కూడా జాక్‌పాట్ కొట్టాడు. ముంబైకి చెందిన మనోజ్ భావ్‌సర్ 16 ఏళ్లుగా అబుదాబిలో ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. 42 ఏళ్ల ఈ ముంబై నివాసికి రూ. 16 లక్షలు లభించాయి.
 
కేరళలో లాటరీల మాదిరిగా కాకుండా, UAE ఎలాంటి పన్ను తగ్గింపు లేకుండా విజేతకు పూర్తి మొత్తాన్ని అందజేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments