Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీ విమానాలపై నిషేధం పొడగింపు...

Webdunia
బుధవారం, 9 జూన్ 2021 (11:04 IST)
మన దేశంలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి క్రమంగా తగ్గుతుంది. అయినప్పటికీ విదేశాలకు వెళ్లే విమాన సర్వీసులపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో భారతీయ విమానాలపై నిషేధాన్ని యూఏఈ పొడిగించింది. ఈ మేరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రకటన విడుదల చేసింది. 
 
కరోనా వ్యాప్తిని నియంత్రించడం కోసం భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధాన్ని జూన్ 30 వరకూ పొడిగించాలని యూఏఈ నిర్ణయించింది. ఏప్రిల్ నెలలో ఈ బ్యాన్ మొదలైంది. గడిచిన 14 రోజుల్లో భారత్‌కు వెళ్లొచ్చిన విదేశీ ప్రయాణికులెవర్నీ యూఏఈలోకి రాకుండా ప్రభుత్వం నిషేధం విధించింది. ఇప్పుడు ఆ నిషేధాన్ని జూన్ 30 వరకూ పొడిగించింది.
 
మరోవైపు, దేశ వ్యాప్తంగా రోజువారీ కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. మంగళవారం 92,596 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దాని ప్రకారం... నిన్న 1,62,664 మంది కోలుకున్నారు. 
 
దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,90,89,069కు చేరింది. మరో 2,219 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,53,528కు పెరిగింది.
 
ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,75,04,126 మంది కోలుకున్నారు. 12,31,415 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 23,90,58,360 మందికి వ్యాక్సిన్లు వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments