Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య

Webdunia
శనివారం, 16 అక్టోబరు 2021 (16:17 IST)
పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువులు దారుణ హత్యకు గురయ్యారు. అలాగే, ఆ దేశంలోని హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతూనేవున్నాయి. బంగ్లాదేశంలో దుర్గ పూజ సందర్భంగా కొన్ని హిందూ దేవాలయలపై దాడులు జరిగాయి. ఈ దాడులకు మత ఘర్షణలకు దారితీశాయి. 
 
ఈ దాడులకు పాల్పడిన వారిని ఉపేక్షించబోమని... వారిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని ఆ దేశ ప్రధాని షేక్ హసీనా గట్టి హెచ్చరికలు చేశారు. అయినప్పటికీ దాడులు ఏమాత్రం ఆగలేదు కదా ఇద్దరు హిందువుల హత్యకు దారితీశాయి. 
 
తాజాగా చెలరేగిన హింసలో ఇద్దరు హిందువులను దారుణంగా హత్య చేశారు. ఈ రెండు మరణాలతో కలిపి ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య ఆరుకు చేరింది. ఓ మందిరంలో ఉన్న హిందూ దేవుడిపై ఖరాన్‌ను ఉంచిన ఫుటేజీ బుధవారం బయటకు వచ్చింది. అప్పటి నుంచి ఆందోళనలు మొదలయ్యాయి.
 
శుక్రవారం ప్రార్థనలు ముగించుకున్న తర్వాత బేగంగంజ్ పట్టణంలో వందలాది ముస్లింలు రోడ్లను ఆక్రమించుకున్నారు. శుక్రవారం పండుగ సందర్భంగా హిందువులు పూజకు సిద్ధమవుతున్న సమయంలో 200 మంది ముస్లిం ఆందోళనకారులు ఆలయంపై దాడికి పాల్పడ్డారు. 
 
ఈ దాడిలో ఆలయ కమిటీ అధ్యక్షుడిని దారుణంగా కొట్టి చంపేశారు. శనివారం ఉదయం గుడి వద్ద ఉన్న కొలను వద్ద మరో మృతదేహం కనిపించింది. ఆ తర్వాత హిందూ వ్యతిరేక నిరసనలు మరో 12 జిల్లాలకు విస్తరించాయి. బుధవారం నుంచి కనీసం నలుగురు చనిపోయారని పోలీసు అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments