Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలగించిన ఉద్యోగుల్లో కొంతమందికి మళ్లీ పిలుపు!

Webdunia
సోమవారం, 7 నవంబరు 2022 (12:09 IST)
ట్విట్టర్ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వశమైంది. దీంతో ఆయన అనేక మంది ఉద్యోగులను తొలగించారు. ట్విట్టర్ తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటుందని పేర్కొంటూ ఉద్యోగులపై వేటు వేశారు. అలా సగం మందిని ఇంటికి పంపించారు. వీరిలో చాలా మందిని మళ్లీ వెనక్కి పిలుస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తిరిగి రమ్మని వారికి లేఖలు రాస్తున్నారు. ఈ మేరకు బ్లూమ్ బర్గ్ ఆదివారం ఓ కథనాన్ని ప్రచురించింది. 
 
సంస్థలోని కమ్యూనికేషన్, కంటెంట్ క్యురేషన్, హ్యూమన్ రైట్స్, మెషిన్ లెర్నింగ్ తదితర శాఖలలో పని చేస్తున్న ఉద్యోగులలో సగం మందిని ఇంటికి పంపించారు. ఇందులో కొంతమంది సేవలు కంపెనీకి అవసరముందని ఆలస్యంగా గ్రహించారు. 
 
కొందరు ఉద్యోగుల తొలగింపులో పొరపాటు జరిగిందని, అందువల్ల అలాంటి వారిని తిరిగి చేర్చుకుంటున్నట్టు పేర్కొంది. ట్విటర్‌లో ఆ సంస్థ కొత్త యాజమాన్యం ఎలాన్ మస్క్ తీసుకునిరాబోయే సరికొత్త మార్పులకు ఈ ఉద్యోగుల సేవలు ఎంతో అవసరమని ఉందని భావించినట్టు బ్లూమ్ బర్గ్ పేర్కొంది. 
 
ఈ నేపథ్యంలో తొలగించిన ఉద్యోగులలో కొంతమందికి తిరిగి వచ్చేయాలంటూ ట్విట్టర్ ఆహ్వానం పంపినట్టు బ్లూమ్ బర్గ్ తెలిపింది. అయితే, ఈ కథనంపై ట్విట్టర్ అధికారికంగా స్పందించలేదు. మరోవైపు, బ్లూ టిక్ చార్జీల పెంపును అమలు చేసేందుకు అవసరమైన మార్పులను ట్విట్టర్ చేపట్టింది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం