Webdunia - Bharat's app for daily news and videos

Install App

టర్కీలో శాంతిర్యాలీ లక్ష్యంగా జంట పేలుళ్లు: 86కి చేరిన మృతులు

Webdunia
శనివారం, 10 అక్టోబరు 2015 (19:09 IST)
టర్కీలో శాంతిర్యాలీ లక్ష్యంగా శనివారం జంట బాంబు పేలుళ్ళు సంభవించాయి. టర్కీలోని అంకారాలోని ప్రముఖ రైల్వేస్టేషన్‌ సమీపంలో ఈ బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ళలో మృతిచెందిన వారి సంఖ్య 86కి చేరింది. ఈ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 
 
టర్కీలో కుర్దు మిలిటెంట్లకు, ప్రభుత్వానికి మధ్య ఘర్షణలను వ్యతిరేకిస్తూ ప్రజలు శాంతి ర్యాలీ నిర్వహించేందుకు అక్కడికి చేరిన సమయంలో ఈ బాంబు పేలుళ్లు జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. 
 
ఈ పేలుళ్ళపై టర్కీ స్వదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం... ఈ ఘటనలో ఇప్పటివరకు 86 మంది చనిపోయారని, 126 మంది వరకు గాయపడినట్టు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం చుట్టుపక్కల ఉన్న ఆసుపత్రులకు తరలించారు. అయితే ఇవి ఆత్మాహుతి దాడులా, బాంబు దాడులా ఇంకా తెలియరాలేదని తెలిపింది. నవంబర్‌ 1 నుంచి టర్కీలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ పేలుళ్ళు జరగడం గమనార్హం. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments