Webdunia - Bharat's app for daily news and videos

Install App

టర్కీలో మళ్లీ భూకంపం - గత రాత్రి 6.4 తీవ్రతతో ప్రకంపనలు

Webdunia
మంగళవారం, 21 ఫిబ్రవరి 2023 (08:30 IST)
ఇటీవల టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భూకంపాల ధాటికి ఆ రెండు దేశాలు శ్మశానవాటికలను తలపిస్తున్నాయి. దాదాపు 46 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. టర్కీలోనే భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఈ భూకపం మిగిల్చిన గాయం నుంచి టర్కీ వాసులు ఇంకా కోలుకోలేదు. ఈ పరిస్థితుల్లో గత రాత్రి మరోమారు టర్కీలో భూమి కంపించింది. ఇది భూకంప లేఖినిపై 6.4గా నమోదైంది. అదేసమయంలో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
గత రాత్రి పొద్దుపోయిన తర్వాత ఈ భూకంపం సంభవించింది. దేశ దక్షిణ ప్రాంతమైన హటే ప్రానిన్స్‌లో 6.4 తీవ్రతతో భూమి కంపించింది. ఈ భూకంపం కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, 200 మందికిపైగా గాయపడ్డారు. గత భూకంపం కారణంగా బీటలు వారిన భవనాలు ఇంకా కూలిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. 
 
కాగా, రెండు వారాల క్రితం ఈ నెల 6వ తేదీన తెల్లవారుజామున టర్కీలోని దక్షిణ కహ్రామన్మారస్ ప్రావిన్స్‌‍తో పాటు సిరియాలో సంభవించిన భారీ భూకంపం తర్వాత మరో 40 సార్లు భూమి కంపించిందింది. ఈ కారణంగా వేలాది భవనాలు నేలమట్టమయ్యాయి. పట్టణాలు శ్మశానవాటికలను తలపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరోమారు భూమి కంపించడంతో టర్కీ వాసులు బెంబేలెత్తిపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments