Webdunia - Bharat's app for daily news and videos

Install App

టర్కీలో మళ్లీ భూకంపం - గత రాత్రి 6.4 తీవ్రతతో ప్రకంపనలు

Webdunia
మంగళవారం, 21 ఫిబ్రవరి 2023 (08:30 IST)
ఇటీవల టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భూకంపాల ధాటికి ఆ రెండు దేశాలు శ్మశానవాటికలను తలపిస్తున్నాయి. దాదాపు 46 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. టర్కీలోనే భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఈ భూకపం మిగిల్చిన గాయం నుంచి టర్కీ వాసులు ఇంకా కోలుకోలేదు. ఈ పరిస్థితుల్లో గత రాత్రి మరోమారు టర్కీలో భూమి కంపించింది. ఇది భూకంప లేఖినిపై 6.4గా నమోదైంది. అదేసమయంలో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
గత రాత్రి పొద్దుపోయిన తర్వాత ఈ భూకంపం సంభవించింది. దేశ దక్షిణ ప్రాంతమైన హటే ప్రానిన్స్‌లో 6.4 తీవ్రతతో భూమి కంపించింది. ఈ భూకంపం కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, 200 మందికిపైగా గాయపడ్డారు. గత భూకంపం కారణంగా బీటలు వారిన భవనాలు ఇంకా కూలిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. 
 
కాగా, రెండు వారాల క్రితం ఈ నెల 6వ తేదీన తెల్లవారుజామున టర్కీలోని దక్షిణ కహ్రామన్మారస్ ప్రావిన్స్‌‍తో పాటు సిరియాలో సంభవించిన భారీ భూకంపం తర్వాత మరో 40 సార్లు భూమి కంపించిందింది. ఈ కారణంగా వేలాది భవనాలు నేలమట్టమయ్యాయి. పట్టణాలు శ్మశానవాటికలను తలపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరోమారు భూమి కంపించడంతో టర్కీ వాసులు బెంబేలెత్తిపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments