Webdunia - Bharat's app for daily news and videos

Install App

టర్కీలో భారీ భూకంపం... రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదు

Webdunia
శనివారం, 25 జనవరి 2020 (09:07 IST)
టర్కీలో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం రాత్రి వచ్చిన ఈ భూకంపం ధాటికి ఇప్పటివరకు 20 మంది చనిపోగా, వందలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. 
 
తూర్పు టర్కీలోని ఇలాజిజ్ ప్రావిన్స్‌, సివ్‌రిన్ జిల్లాలో ఈ భూకంపం సంభవించింది. భూప్రకంపనలు మొదలుకాగానే జనం భయంతో వీధుల్లోకి వచ్చి పరుగులు తీశారు. స్వల్ప కాలంలోనే 60 ప్రకంపనలు నమోదైనట్టు టర్కీ విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు.
 
భూకంపం ధాటికి కూలిన భవనాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. శిథిలాల కింద 30 మంది వరకు చిక్కుకుని పోయి ఉంటారని భావిస్తున్నారు. వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. కాగా, సిరియా, లెబనాన్‌లోనూ భూప్రకంపనలు సంభవించినట్టు అధికారులు తెలిపారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments